Manchu manoj: మంచు ఫ్యామిలీలో ఒకప్పుడు మంచు మనోజ్ సినిమాలకు కాస్త క్రేజ్ ఉండేది. అయితే రానురాను పేలవమైన సినిమాలను ఎంచుకోవడంతో మనోజ్ క్రేజ్ కూడా మంచులాగా కరిగిపోయింది. ప్రస్తుతం మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ల యొక్క సినీ కెరీర్ గందరగోళంగా ఉందనే విషయం అందరికీ విదితమే. అయితే విష్ణు వరుసగా ప్లాప్ లు ఎదుర్కొంటున్నా సినిమాలు చేయడం మాత్రం మానలేదు. కాని మంచు మనోజ్ మాత్రం ఎందుకనో సినిమాలు చేసే విషయంలో కాస్త వెనక్కి తగ్గాడని చెప్పుకోవాలి. ఈ విషయమై మంచు అభిమానులు తీవ్ర నిరాశలో వున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Manchu manoj: మనోజ్ ఇపుడు ఏం చేస్తున్నాడో
మనోజ్ చివరి సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఇక రెండేళ్ల క్రితం మొదలైన “అహం బ్రహ్మాస్మి” సినిమా ఏమయ్యిందో తెలియదు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా నుండి ఒక కాన్సెప్ట్ పోస్టర్ రైలుజు అవ్వడం తప్ప, ఇంకే అప్డేట్ కూడా లేదు. ఈ సంవత్సరం చివరిలోనైనా ఈ సినిమాతో మంచు మనోజ్ వస్తాడేమో అని మంచు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమానుండి ఇంతవరకు ఎటువంటి సమాచారం లేనందున వరుస సినిమాల ప్లాపుల వలన మనోజ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా ప్రకటన రావడంతో అంతా షాక్ అవుతున్నారు.
మధ్యలో వైష్ణవ్ తేజ్ ఎందుకొచ్చాడు?
మంచు మనోజ్ “అహంబ్రహ్మాస్మీ” సినిమాకు, వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమాకు ఓ సంబంధం వుంది. అదేమంటే ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒక్కడే. ఆయనే శ్రీకాంత్ రెడ్డి. అహం బ్రహ్మాస్మీ మొదలు పెట్టాలని ఎదురు చూసి చూసి చివరకు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ క్రమంలో వైష్ణవ్ తో చేస్తున్న సినిమా కథ.. మనోజ్ “అహం బ్రహ్మాస్మి” కథ ఒక్కటేనేమో అనే అనుమానం మంచు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రిలీజైన ఓ పోస్టర్ ని చూస్తే ఆ అనుమానం నిజమే అనిపిస్తుంది. ఇపుడు ఇంతకీ మన మంచు మనోజ్ పరిస్థితి ఏమిటి?
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!