Nindu Noorella Saavasam February 27 2024 Episode 169:అలాగే అంటూ అమరేంద్ర భాగమతి శివరామ్ నిర్మల ఓకే కారులో బయలుదేరుతారు. అవకాశం కల్పించుకుని మా ఆయన పక్కన కూర్చోవాలి అనుకునే మను ఈరోజు ఆయనే రమ్మని పిలిచినా ఎందుకు వెళ్లట్లేదు అని అరుంధతి అనుకుంటుంది. అమ్మగారు మీరు అనుకున్నది అనుకున్నట్టు పట్టుబట్టి సాధించారు అని నీలా అంటుంది. నీలా మేము వచ్చేదాకా ఇల్లు ని జాగ్రత్తగా చూసుకో అని రాథోడ్ అంటాడు. నా అమర్ తో నిన్ను జంటగా పంపిస్తున్నాను అంటే ఇక నువ్వు ఎప్పటికీ తిరిగి మళ్ళీ ఇంటికి రావు బాగి అని మనోహరీ అంటుంది. ఏమను ఎందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావ్ ఏం చేయాలనుకుంటున్నావ్ అని అరుంధతి అంటుంది.రాథోడ్ బయలుదేరుదామా అని పిల్లలు అంటారు. అబ్బో సూపర్ గా తయారయ్యారుగా అని రాథోడ్ అంటాడు. మరి మిస్సమ్మ పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి కదా అని పిల్లలు అంటారు.
అందరూ కార్లో కూర్చొని బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అరుంధతి కూడా కారెక్కి ఇది ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే దీని వెనకాల వెళ్లాలి అని అరుంధతి అనుకుంటుంది. మనోహరి పిల్లల్ని చూసి నవ్వుతుంది. ఇది నవ్వుతుందంటే కచ్చితంగా ఏదో చేస్తుంది ఏమను నా పిల్లలను ఏం చేయాలనుకుంటున్నావే అని అరుంధతి అంటుంది. కట్ చేస్తే, రామ్మూర్తి బలవంతంగా లేచి కింద పడిపోతూ నడవలేక అడుగులు తడబడుతున్న మండపానికి బయలుదేరుతాడు. అమరేంద్ర వాళ్లు కార్లో వెళ్తూ ఉంటారు. అమరేంద్ర ఎఫ్ఎం పెడతాడు. అందులో భాగీ కి సంబంధించిన ప్రశ్న వస్తుంది. వెంటనే అమరేంద్ర ఎఫ్ఎం ని బంద్ పెడతాడు. ఆర్జి బాగి అంటే మా కోడలికి ఎంత ఇష్టమో తెలుసా మిస్సమ్మ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అంతలా దగ్గర అయిపోయారు అని నిర్మల అంటుంది.
అందుకే ఒకరు నొకరు కలుసుకోవాలనుకున్నారు మా కోడలికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అమ్మ కానీ ఏం చేస్తాం వాళ్ళిద్దరూ కాల్వకుండానే దేవుడు మా కోడల్ ని తీసుకువెళ్లిపోయాడు అని శివరామ్ అంటాడు. ఎవరి గురించండి మాట్లాడుతున్నారు అని భాగమతి అడుగుతుంది. భాగికి పెళ్లయిందాకా అరుంధతి గురించి తెలియకూడదు అనుకున్నాను తెలిసేలా ఉంది అని అమరేంద్ర టాపిక్ ని డైవర్ట్ చేస్తూ మీ నాన్న ఎలా ఉన్నాడు మిస్సమ్మ పెళ్లికి వస్తున్నాడా అని అడుగుతాడు. ఆయన కోసం చేసుకుంటున్న పెళ్లి ఆయన రాకపోతే ఎలాగండి అని భాగమతి అంటుంది. అదేంటి మిస్సమ్మ అలా అంటావ్ అని శివరామ్ అంటాడు. మా నాన్న కళ్ళల్లో సంతోషం చూడడం కోసం ఇప్పుడు పెళ్లి జరుగుతుంది కదా దాని గురించి మాట్లాడుతున్నాను అంకుల్ అని భాగమతి అంటుంది. మీ నాన్న కోసం ఇంత తొందరగా నీ పెళ్లి జరుగుతుందా అని శివరామ్ అంటాడు. రామ్మూర్తి రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్ళని వీళ్ళని లిఫ్ట్ అడుగుతున్నాను గుడి దగ్గర డ్రాప్ చేయరా అని అడుగుతాడు.కట్ చేస్తే,రాథోడ్ నడుపుతూ ఉండగా కారు సడన్గా ఆగిపోతుంది.
ఏమైంది రాథోడ్ అని అంజలి అడుగుతుంది. ఇప్పుడే ఆగిపోయింది కదా అంజలి పాప దిగి చూస్తే తెలుస్తుంది ఏమైందో అని రాథోడ్ కారు దిగి చూస్తాడు. కారు ఆగిపోయింది ఇది నవ్వుతుంది అంటే ఇదే ఏదో ఒకటి చేసి ఉంటుంది అని అరుంధతి అనుకుంటుంది. బ్యాటరీ వైరు ఇంటి దగ్గరే తెగిపోయినట్టుందే చూసుకోలేదు ఇప్పుడెలా అని రాథోడ్ అనుకుంటాడు. ఏమైంది రాథోడ్ అని పిల్లలు అంటారు. బ్యాటరీ వైర్ తెగిపోయింది అమ్మ కారు నడవడం కష్టం అని రాథోడ్ అంటాడు. ఇప్పుడు ఎలా రాథోడ్ పెళ్లికి లేట్ అయిపోతుంది అని పిల్లలు అంటారు. అంజలి పాప మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మెకానిక్ ని తీసుకొస్తాను అని రాథోడ్ వెళ్ళిపోతాడు. పిల్లలు నీళ్లను చూసి మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. మనోహరి పిల్లలను చూసి నవ్వుతుంది. ఇక రెండో స్టాప్ మొదలు పెట్టాలి అని మనోహరి పిల్లలు రాథోడ్ రావడానికి లేట్ అవుతుంది అనుకుంటా మనం వెళ్దామా అని మనోహరి అంటుంది. రాథోడ్ వచ్చాక వెళ్దామా ఆంటీ అని అమృత అంటుంది.
నేనున్నాను కదా మనం కలిసి వెళ్దాం అని మనోహరి అంటుంది. రాథోడ్ ఉంటేనే ఎటైనా వెళ్ళమని డాడీ చెప్పాడు రాథోడ్ లేకుండా మేము రాము ఆంటీ అని అమృత అంటుంది. ఏం మను ఏం చేయాలనుకుంటున్నావే నా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తావ్ నా పిల్లలకి ఏమన్నా అయితే మా ఆయన నిన్ను చంపేస్తాడు అని అరుంధతి అంటుంది. రాథోడ్ మీ నాన్న కోసం పని చేస్తాడు నేను మీ అమ్మ ఫ్రెండ్ ని నా కన్నా రాథోడ్ మీదే మీకు నమ్మకం ఎక్కువ అని మనోహరి అంటుంది. సరే ఆంటీ ఎలా వెళ్దాం అని అంజలి అంటుంది. ఏదైనా కారు వస్తుందేమో లిఫ్ట్ అడుగుదాం అని మనోహరి అంటుంది. ఇంతలో ఒక కారు వస్తుంది కార్ ఆపి లిఫ్ట్ అడుగుతుంది మనోహరి. అతను ఓకే మేడం అని అంటాడు. పిల్లలందరూ కారులో కూర్చుంటారు మనోహరి ముందు సీట్లో కూర్చుంటుంది. ఆ కార్లో పిల్లలు వెళ్లిపోతారు. కట్ చేస్తే, అమరేంద్ర వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు. ఖాళీ పెళ్లి పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. వాళ్లని చూసినా మంగళ ఆ పిల్లల్ని తీసుకురాలేదు రా నేను వెళ్లి వాళ్ళని తీసుకొస్తాను అని వెళుతుంది. మంగళ వెళ్తున్నప్పుడు పసుపు ఉన్న తాంబాలం తగిలి పసుపంతా కింద పడుతుంద. ఎంత అందంగా ఉన్నావు అమ్మాయి కుందన బొమ్మలా ఉన్నావు రా అని మంగళ తీసుకువెళ్తుంది వాళ్ళని.
అమరేంద్ర భాగమతి వెళ్తూ ఉండగా అక్కడ శివయ్య కనపడతాడు. భాగమతి శివయ్యకి నమస్కారం పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ పసుపులో నుంచి అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే పసుపు అడుగులు పడతాయి. కట్ చేస్తే, భాగమతి మంగళసూత్రాన్ని చూసి మొహం చాటేసుకుంటుంది. ఇదేంటమ్మా పెళ్లంటే హడావుడిగా బంధువులు చుట్టాలు చాలామంది ఉండాలి పట్టుమని పదిమంది కూడా లేరేంటి అని శివరామ్ అంటాడు. మా ఊరు చాలా దూరం కదా సార్ పిలిచినా ఎవరూ రారు అందుకే ఇక్కడ ఉన్న కొద్దిమందిని పిలిచాం అని ఖాళీ అంటాడు. పెళ్లి గ్రాండ్ గా ఫంక్షన్ హాల్ లో జరిపిస్తామంటే గుళ్లోనే ఎందుకు చేయాలన్నారు అని నిర్మల అడుగుతుంది. మీలాంటి గొప్పోళ్ళ ఆశీస్సులు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉంటే చాలు కథ అమ్మగారు అని మంగళ అంటుంది. భాగమతి గుడి అంతా చూసి పిన్ని నాన్న ఎక్కడ అని అడుగుతుంది. మీ నాన్న ఇంకా రాలేదు బాగి అని మంగళ అంటుంది. నాన్న నా పెళ్ళికి రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నాడు పిన్ని ఒక మాట చెప్తే నేనేనా వచ్చేటప్పుడు తీసుకువచ్చే దాన్ని కదా అని భాగమతి అంటుంది. ఒక్కని ఎందుకు వదిలేసి వచ్చానమ్మా నర్స్ ని పెట్టాను మీ నాన్నకి చూదేస్తే నిద్రొస్తుంది కాసేపు పడుకున్న తర్వాత తీసుకు రమ్మన్నాను వస్తాడులే పెళ్లి కానివ్వు అని మంగళ అంటుంది. మిస్సమ్మ నేను వెళ్లి మీ నాన్నని తీసుకొస్తాను అని అమరేంద్ర అంటాడు. రామ్మూర్తి రోడ్డు మీద నడవలేక నడవలేక వస్తూ ఉంటాడు. ఆయన కార్లకు కూర్చోలేడు బాబు అంబులెన్స్ లో తీసుకొచ్చే ఏర్పాటు చేశాను అని మంగళ చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!