ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ నిహారిక వెడ్డింగ్. నాగబాబు ముద్దుల తనయ నిహారిక – చైతన్య వివాహం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా మారిపోయింది. సోషల్ మీడియా మొత్తం నిహారిక పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ తో హోరెత్తిపోతోంది. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్ లో ల్యాండ్ అయిపోయారు. మెగా ఫ్యాన్స్ కు వీరంతా ఒకే ఫ్రేమ్ లో ఉండటం కిక్కు ఇస్తోంది. అయితే.. అందరూ ఉన్నా అందులో ఓ లోటు. అదే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అందరి చూపూ ఆయన కోసమే. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయింది.
పవన్ కల్యాణ్ ఉదయ్ పూర్ లో ల్యాండ్ అయిపోయాడు. అందరూ రాజస్థాన్ వెళ్లి రెండు రోజులైనా పవన్ మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. రైతులకు మద్దతు ధర కోసం ఒకరోజు దీక్ష చేపట్టాడు. దీంతో అందరిలో ఒకటే టెన్షన్. పవన్ తన అన్న కూతురు పెళ్లికి వెళ్తాడా లేదా.. అని. కానీ.. అందరి అనుమానాలకు తెర దించుతూ పవన్ రాజస్థాన్ లో ల్యాండ్ అయిపోయాడు. పిల్లలు అకిరా, ఆద్యలతో కలసి పవన్ నిహారిక పెళ్లికి వెళ్లాడు. పవన్ ఎంట్రీతో అక్కడ సందడే మారిపోయింది. పవన్ ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మరో రేంజ్ లో హోరెత్తిస్తున్నాయి. మెగా పెళ్లి సందడి ఫుల్ లోడెడ్ గన్ అయింది. నిహారిక – చైతన్యకు విశెష్ చెప్తున్న పవన్ ఫోటోలను ఫ్యాన్స్ బీభత్సంగా షేర్ చేస్తున్నారు.
నాగబాబు ఏర్పాటు చేసిన ప్రైవేట్ జెట్స్ లో మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్ ఉదయ్ పూర్ లో సందడి చేస్తోంది. పవన్ కూడా ప్రైవేట జెట్ లోనే వెళ్లారు. ఇప్పటికే అక్కడ సంబరాలు, పాటలు, డ్యాన్సులతో మెగా ఫ్యామిలీ ఖుషీ చేస్తున్నారు. నిహారిక – చైతన్య డ్యాన్సులతో సందడి చేశారు. ఇంత సందడిలో పవన్ కూడా యాడ్ కావడంతో పెళ్లి సందడికి పరిపూర్ణత లభించింది. రేపు డిసెంబర్ 9న రాత్రి 7:15 నిమిషాలకు వీరిద్దరి వివాహం జరుగనుంది. సోషల్ మీడియాలో #Nischay అనే హ్యాస్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది.