Radhe Shyam: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమాకు కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు.
ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్రభాస్, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా నటించారు. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ ప్రభాస్కు ఉన్న క్రేజ్ దృష్యా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 25.49 కోట్లు, రెండో రోజు రూ. 12.32 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 10.58 కోట్ల షేర్ను రాబట్టి అదరగొట్టేసింది. ఇక ఏరియాల వారీగా ఫస్ట్ వీకెండ్ రాధేశ్యామ్ టోటల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం: 22.31 కోట్లు
సీడెడ్: 6.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.26 కోట్లు
తూర్పు గోదావరి: 3.87 కోట్లు
పశ్చిమ గోదావరి: 2.98 కోట్లు
గుంటూరు: 4.08 కోట్లు
కృష్ణ: 2.34 కోట్లు
నెల్లూరు: 1.90 కోట్లు
———————————————————————-
ఏపీ+తెలంగాణ మొత్తం- 48.39కోట్లు(75.20కోట్లు~ గ్రాస్)
———————————————————————-
కర్ణాటక: 3.95 కోట్లు
తమిళనాడు: 0.61 కోట్లు
కేరళ: 0.13 కోట్లు
హిందీ: 6.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.40 కోట్లు
ఓవర్సీస్- 10.55 కోట్లు
————————————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్- 71.83కోట్లు(126.50కోట్లు~ గ్రాస్)
————————————————————————–
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధేశ్యామ్.. రూ. 204 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. ఇక మొదట మూడు రోజుల్లో రూ. 71.83 కోట్లు రాబట్టిన ఈ మూవీ క్లీన్ హిట్ అవ్వాలంటే.. ఇంకా రూ. 132.17 షేర్ను వసూల్ చేయాల్సి ఉంటుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!