RRR: ఎన్నో ఏళ్ల ఉత్కంఠ మరికొద్ది గంటల్లో తెరపడనుంది. “RRR” మరి కొద్ది గంటల్లో విడుదలవుతున్న నేపథ్యంలో.. సినిమా థియేటర్ల వద్ద నందమూరి మరియు మెగా అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. “బాహుబలి” లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” తెరకేక్కడంతో… సినిమా ఎలా ఉంటుందో అన్నది దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గుర్తొచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే “బాహుబలి” విడుదల అయ్యిందో అప్పటినుండి.. రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా డబుల్ త్రిబుల్ గా వినబడుతోంది.
ఇంతటి ఖ్యాతి కలిగిన రాజమౌళి…”ఆర్ఆర్ఆర్” సినిమాకి ఇండియాలో ఏ డైరెక్టర్ తీసుకొని రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్ వినపడుతోంది. విషయంలోకి వెళితే సినిమా నిర్మించిన డివివి ఎంటర్టైన్మెంట్స్.. రాజమౌళికి 80 కోట్లు పారితోషికం మాత్రమే కాదు లాభాల్లో 30 శాతం వాటా కూడా ఇవ్వటానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ లకి ఒక్కొక్కరికి 45 కోట్ల రెమ్యూనరేషన్ నిర్మాత అందించినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల అవుతున్న తరుణంలో… ఫలితం ఎలా ఉంటుందో.. బాహుబలి రికార్డులు “ఆర్ఆర్ఆర్” బ్రేక్ చేస్తుందో లేదో అనేది సస్పెన్స్ గా మారింది. ఏకంగా ఈ సినిమా కోసం రెండున్నర సంవత్సరాలు కష్టపడటం తో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో.. చురుగ్గా పాల్గొనటంతో.. భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. దాదాపు సినిమా.. నాలుగు వందల కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఎంత ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్.. ఎలా ఉంటుందో.. ఎంత కలెక్షన్ రాబడుతోంది అన్నది సస్పెన్స్ గా నెలకొంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!