Samantha: గత రెండు సంవత్సరాల నుండి సమంతా జీవితం అనేక కష్టాల గుండా పయనం అవుతూ ఉంది. 2021లో నాగచైతన్యతో విడాకులు ఆ తర్వాత 2022లో మయోసైటీస్ వ్యాధిన బారిన పడటంతో.. అటు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలతో మానసికంగా నలిగిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలలో సమంత నటించిన “ఖుషి” సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాతో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న సమంత.. తర్వాత మరో ప్రాజెక్ట్ ఏది కూడా ఒప్పుకోలేదు. పైగా మాయోసైటీస్ వ్యాధికి తీసుకున్న ట్రీట్మెంట్ కారణంగా చాలా బలహీనం పడటంతో.. ప్రస్తుతం విదేశాలలో పూర్తిస్థాయిలో రికవరీ అవుతుంది. కోల్పోయిన అందం అంత తిరిగి పొందుకోవడానికి.. విదేశాలలో విశ్రాంతి తీసుకుంటూ.. బ్యాలెన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.
ఇదిలా ఉంటే సమంత మరో పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ కొనసాగించాలని డిసైడ్ కావడం జరిగింది అంట. ప్రస్తుతం ఆమె వయసు 36 సంవత్సరాలు. ఈ క్రమంలో పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏజ్ బార్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఇటువంటి క్రమంలో ఇంటిలో తల్లిదండ్రుల నుండి రెండో పెళ్లి విషయంపై కూడా ఒత్తిడి వస్తూ ఉందట. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడు. ఆల్రెడీ కేరియర్ పరంగా నీ జీవితం అద్భుతంగానే ఉంది. కాబట్టి జీవితంలో.. తోడుగా ఓ మనిషి అవసరం ఉంటది అని కుటుంబ సభ్యులు సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట. కానీ సమంతకి పెళ్లి జీవితం పై విరక్తి కలిగినట్లు దీంతో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో.. వెబ్ మీడియాలో టాక్ నడుస్తోంది.
విషయంలోకి వెళ్తే పూర్తిగా నటిగా జీవితాన్ని కొనసాగించాలని ఇదే సమయంలో తల్లి కావాలని భావిస్తూ ఉందట. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని ఆలోచనలో సమంత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ సమంత భర్తను కోల్పోయిన మహిళలకు సంబంధించి అనాధలకు సంబంధించి.. అనేక చారిటీ కార్యక్రమాలు చేయడం జరిగింది. 2014లో ప్రత్యూష సపోర్టు పేరుతో చారిటీ సంస్థను కూడా నడుపుతూ ఉంది. ఈ సంస్థ ద్వారా మహిళలు మరియు తల్లిదండ్రులు లేని ఆడపిల్లల సంక్షేమానికి ఎంతో సహాయపడుతూ ఉంది. అయితే తాజాగా తనకంటూ ఓ ప్రపంచం ఉండే విధంగా ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకోవడానికి సమంత డిసైడ్ అయ్యిందట. ఇక ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టులకి సంబంధించి ఎక్కువ బాలీవుడ్ పైనే సామ్ దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.