samyuktha menon: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించాడు. మాలయళ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటించారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న థియేటర్స్లోకి దిగిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా పవర్, రానాల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నీత్యా మీనన్ సైతం ఈ మూవీ మంచి కంబ్యాక్ ఇచ్చింది. కానీ, సంయుక్త మీనన్కు మాత్రం అన్యాయం జరిగిందంటూ ప్రచారం మొదలైంది.
సంయుక్త పాత్రను చాలా వరకు తగ్గించారని, సీన్లు అన్నీ కట్ చేసేశారని.. దాంతో ఆమె ఎంతగానో బాధపడుతుందని సోషల్ మీడియా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన సంయుక్త.. ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేసింది.
`అవును నేను భీమ్లా నాయక్ విషయంలో బాగా బాధపడ్డాను. అయితే నా పాత్ర విషయంలో కాదు. అభిమానులందరితో కలిసి రెండవ సారి సినిమా చూడాలనుకున్నా. కానీ టిక్కెట్లు దొరకలేదు. అందుకే మనస్తాపం చెందాను` అంటూ సెటైర్లు పేల్చింది. దీంతో ఈమె ట్వీట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
The only time I was disappointed with Bheemla Nayak was when I did not get tickets to watch the film the second time with all the fans 😒#happydebut #mybiggestblockbuster https://t.co/EQepl1SnJh
— Samyuktha (@iamsamyuktha_) March 2, 2022
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!