KGF 2: “కేజిఎఫ్ 2” సినిమా కోసం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు సినిమా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. రేపటి నుండి అడ్వాన్స్ బుకింగ్ కర్ణాటకలో ప్రారంభంకానున్నాయి. “కేజిఎఫ్ ” మొదటి భాగం 2018లో వచ్చి అన్ని చాట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. కన్నడలో మొదట చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఓవర్ నైట్ లోనే యాష్ నీ పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన విజయంతో… “కేజిఎఫ్ 2” అనేక ఇండస్ట్రీలలో స్టార్ హీరోల సినిమాలకు మంచి పోటీ ఇస్తోంది.
ముఖ్యంగా తమిళంలో “కేజిఎఫ్ 2” సినిమా విడుదలయ్యే టైంలోనే దళపతి విజయ్ నటించిన బీస్ట్.. ఒకరోజు ముందు విడుదల అవుతూ ఉండటం తో రెండు సినిమాల మధ్య పోటాపోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్లో ఈ రెండు సినిమాలకి హెడ్ టు హెడ్ అన్నట్టు పోటీ నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “కేజిఎఫ్ 2″ సినిమా చూడటానికి బాలీవుడ్ ప్రేక్షకులు మొదటిదాని కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించడం. ఈ క్రమంలో తాజాగా సంజయ్ దత్…”కేజిఎఫ్ 2” లో నటించడానికి ప్రధాన కారణం గురించి విషయం బయట పెట్టారు.
మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం తన భార్య మాన్యత అని సంజయ్ దత్ కొత్త విషయాన్ని బయట పెట్టారు. అసలు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ లేని టైంలో.. మాన్యత ఒత్తిడి చేయటంతో “కేజిఎఫ్ 2” లో విలన్ పాత్ర చేయడం జరిగిందని రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆమె చెప్పడం వల్లే స్క్రిప్ట్ విన్నాను ఆ తరువాత ఖచ్చితంగా ఇది నా కెరీర్ లోనే బెస్ట్ రోల్ అవుతుంది..అని సంజయ్ దత్ తాజా ఇంటర్వ్యూలో “కేజిఎఫ్ 2” పాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!