సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా నటించి హీరోల చేతిలో దెబ్బలు తింటూ ప్రేక్షకులను అలరించిన సోనూసూద్, కరోనా లాంటి కష్ట కాలంలో చాలా మందికి సహాయపడి అసలైనా రియల్ హీరో అనిపించుకున్నాడు. ముఖ్యంగా వలస కూలీల పాలిట సోనుసూద్ వ్యవహరించిన తీరు కొన్ని ప్రభుత్వాలను, మరికొంతమంది సెలబ్రిటీలను కదలించడం జరిగింది. చాలామంది వలస కూలీలు లాక్ డౌన్ సమయంలో కాలినడక నడుస్తూ ఇంటికి చేరే ప్రక్రియలో మార్గం మధ్యలోనే తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. ఇలాంటి తరుణంలో స్పెషల్ ట్రైన్ లు స్పెషల్ బస్సులు అదేరీతిలో ఫ్లైట్లు ఏర్పాటుచేసి అనేక మంది వలస కూలీల ను ఇంటికి చేర్చాడు. అంతేకాకుండా కొంతమందికి ఆర్థికంగా కూడా సహాయపడి …. దేశవ్యాప్తంగా అనేక మందికి సహాయం చేయడం కోసం స్పెషల్ టీం, టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో కూడా ఓ రైతు కి ట్రాక్టర్ అదే రీతిలో ఉద్యోగం లేక కూరగాయల అమ్ముకుంటున్న చదువుకున్న ఓ అమ్మాయికి సాఫ్ట్ వేర్ జాబ్ ఇప్పించడం జరిగింది. ఇంతలా సహాయపడటానికి సోనూసూద్ లో కసి రావటానికి గల కారణం ఆయన కష్టం తెలిసిన వాడు అని ఆయన సన్నిహితులు అంటున్నారు. నటుడిగా ముంబైకి ఒంటరిగా అడుగుపెట్టిన సోను సూద్…. తన ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూశాడు.
అందువల్లే ఆపదలో ఉన్న వాళ్లకు సోను సూద్ కష్టం తెలిసిన వాడు కాబట్టి సహాయం చేస్తున్నాడు అని అను సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. సోనూసూద్ చేసిన సహాయానికి దేశంలో పెద్ద పెద్ద స్టార్ల అని చెప్పుకునే వాళ్ళు కూడా ముక్కున వేలేసుకున్నారు. పేదరికం నుండి వచ్చిన సోను సూద్ ఇప్పుడు చాలా వరకు పేదవారిని ఆదుకోడానికి ముందుకు వస్తూ భారతదేశ యూత్ ఐకాన్ గా నిలుస్తున్నాడు. ఈ కరోనా కష్టకాలంలో కొన్ని ప్రభుత్వాలు, వ్యవస్థలు చేయాల్సిన పనులు దాదాపు సోనూసూద్ ఒంటగా చేయటం దేశవ్యాప్తంగా హైలెట్ గా నిలుస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు.