Trinayani March 2 2024 Episode 1178: ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఏర్పాట్లు చేసుకుంటాను అంటూ మన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, విక్రాంత్ బాబు టిఫిన్ చేయడానికి రండి అని నైని అంటుంది. అమ్మ వాళ్లు కూడా రానివ్వండి అని విక్రాంత్ అంటాడు. తిలోత్తమ వల్లభ మాత్రం గాయత్రి పాపని బుట్టలో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. బావగారు టిఫిన్ చేయకుండా ఎక్కడికి బయలుదేరుతున్నారు అని నైని అడుగుతుంది. పనుంది వెళ్తున్నామని వల్లభ అంటాడు. అన్నయ్య అయిదు నిమిషాల్లో తినేసి వెళ్ళండి అని విశాల్ అంటాడు.మమ్మీ వడ తిందామా అని వల్లభ అంటాడు. దవడ పగులుతుంది అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య వెళ్ళండి కానీ ఆ బుట్టెక్కడికి అని నైని అడుగుతుంది. బ్యాంకుకు వెళ్తున్నాం అందుకే తీసుకెళ్తున్నామని తిలోత్తమ అంటుంది. బ్యాంకుకి బుట్టలు కూడా తీసుకువెళ్తారా అని హాసిని అంటుంది. మమ్మీ హాసినికి నిజం తెలియక మాట్లాడుతుంది అని వల్లభ అంటాడు.
బావ గారు అత్తయ్యని మాత్రమే మాట్లాడనివ్వండి మీరు మాట్లాడకండి అని సుమన అంటుంది. మీరు ముగ్గురు ఒక్క మాట మీద భలే ఉంటారే అని విక్రాంత్ అంటాడు. ఆ బుట్టలో ఏముందో తెలుసుకోండి పుత్రా అని డమ్మక్క అంటుంది. అన్నయ్య అలా అన్నాడు అంటే అందులో ఏదో ముఖ్యమైందే ఉండి ఉంటుంది అని విశాల్ అంటాడు. క్యాష్ ఉంది విశాల్ అని తిలోత్తమ అంటుంది. బ్యాగులో తీసుకొని వెళ్ళ వచ్చు కదా అని నైని అంటుంది. బ్యాగులల్లో అయితే దొంగలకు తెలిసిపోతుంది కదా నైని అని దురంధర అంటుంది. దురంధరకి బాగా తెలుసు అని తిలోత్తమ అంటుంది. విశాల్ దురంధర చేతిలో ఉన్న బౌలు తీసుకుంటాడు . మామయ్య తినండి అంటూ విశాల్ పావనమూర్తిని అంటాడు. నాకొద్దు అల్లుడు అంటూ వల్లభ చుట్టూ తిరుగుతూ ఉంటాడు పావన మూర్తి. విశాల్ నీళ్లు ఆ బుట్ట మీద పోస్తాడు. నోట్లు తడిసిపోతాయి బాబు గారు అని నైని అంటుంది. వేడి నీళ్లు పడ్డా లేవలేదు ఏంటి మమ్మీ అని వల్లభ అంటాడు. బావగారు ఏం మాట్లాడుతున్నారు అని సుమన అంటుంది.లేవలేదు అంటున్నారు బుట్టలో నుంచి పాములేస్తుందా ఏంటి అని పావన మూర్తి అంటాడు.
వేడి నీళ్లు పడితే గాయత్రి పిల్ల ఏమి అర్వకుండా ఎలా ఉంది అని సుమన అనుకుంటుంది. అత్తయ్య డబ్బులు తడిసిపోయి ఉంటే ఆరబెడితే బాగుంటుంది అని నైని అంటుంది. పర్వాలేదులే నైని అని తిలోత్తమ అంటుంది. మీకు అంత డబ్బు ఎక్కడిది అని విక్రాంత్ అంటాడు. ఇంతలో హాసిని గాయత్రి పాపని ఎత్తుకొని వస్తుంది. మమ్మీ గాయత్రి పాప అక్కడ ఉందేంటి అని వల్లభ అంటాడు. ఇంకెక్కడ ఉండాలి రాజా బుట్టలోన అని హాసిని అంటుంది. ఈ లోపు టిఫిన్ చేసేవాళ్ళు కదా అమ్మ అని విశాల్ అంటాడు. బాస్కెట్ లో పట్టుకెళ్ళేది డబ్బా? ఒకసారి చూసుకోండి బావగారు అని సుమన అంటుంది. రేయ్ కార్లో చూద్దాం పదరా అని తిలోత్తమ అంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి చూసుకొని వెళ్ళండి అని దురంధర అంటుంది. బుట్ట కింద పెట్టి చూసేసరికి అందులో రాళ్లు ఉంటాయి.
ఈ రాళ్లతో ఏం చేసుకుంటారు అక్కయ్య అని పావను మూర్తి అంటాడు. అన్నయ్య ఏంటి ఈ పిచ్చి పని అమ్మ డబ్బులు పెట్టమంటే రాళ్ళు ఎందుకు పెట్టావ్ అని విశాల్ అంటాడు. నేను పెట్టలేదు అని వల్లభ అంటాడు. ఎవరో పెట్టారు విశాల్ అని తిలోత్తమ అంటుంది. నేనే మార్చేశాను కదా అని హాసిని అనుకుంటుంది. సుమన గాయత్రి పాపని బుట్టలో పెడుతూ ఉండగా చూసి తనను తీసి రాళ్లు పెడుతుంది హాసిని. రాళ్ళు ఇలా ఇవ్వండి పడేస్తాను అని నైని అంటుంది. నీకెందుకు శ్రమ మేం పడేస్తాంలే అంటూ వల్లభ తిలోత్తమ వెళ్ళిపోతారు. రా చిట్టి టిఫిన్ చేద్దాం అని హాసిని అంటుంది. నేను తర్వాత తింటాను అంటూ సుమన వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏం జరిగింది అని అఖండ స్వామి అంటాడు. మీరిచ్చిన మత్తు మూలికను గాయత్రి పాపకి వాసన చూపించలేదు స్వామి అని తిలోత్తమ అంటుంది. మీరేం చేశారు అని అఖండ స్వామి అంటాడు. మీరిచ్చిన మూలికను నాకే వాసన చూపించాడు అని తిలోత్తమ అంటుంది. 30 సంవత్సరాలు వచ్చినా నీకు ఇంగీత జ్ఞానం రాలేదంటే నిన్ను ఏమనాలి అని అఖండ స్వామి అంటాడు. అలాంటప్పుడు మా అమ్మని ఏమనాలి అని వల్లభ అంటాడు. నువ్వేం చేసావ్ తిలోత్తమ అని అఖండ స్వామి అంటాడు. మీరిచ్చిన మూలికని గాయత్రి పాప పాలలో కలిపి తాపిస్తే స్పృహ కోల్పోతుందని పాలల్లో కలిపాను నీరసంగా ఉన్నానని ఆ పాలు నన్ను తాగమన్నారు అని తిలోత్తమ అంటుంది. మరి నువ్వు తాగావా అని అఖండ స్వామి అంటాడు.
ఆ పాలు నేను తాగేశాను అని వల్లభ అంటాడు. ఈసారి నువ్వు మూర్చ పోయావా అని అఖండ స్వామి అంటాడు. గాయత్రి పాపని ఇక్కడికి తీసుకురమ్మంటే ఇల్లు దాటకుండా మీరే మూర్ఛ పోయారు ఏం చేయమంటారు అని అఖండ స్వామి అంటాడు. మీరే సెలవివ్వాలి అని తిలోత్తమ అంటుంది. నేనే రంగంలోకి దిగుతాను రేపు మీ ఇంటికి వచ్చి గాయత్రి అవునా కాదా అని తేలిచేస్తాను అని అఖండ స్వామి అంటాడు. అయితే పరీక్ష మీకా? అని వల్లభ అంటాడు. మీరు వచ్చేయండి స్వామి అంటూ తిలోత్తమ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, హాసిని సుమన గదిలోకి వస్తుంది. ఎందుకు అక్క అంత గట్టిగా డోర్ ని కొట్టావ్ అని సుమన అంటుంది. గాయత్రి పాపని తిలోత్తమ అత్తయ్య వాళ్ళకి బుట్టలో పెట్టిస్తే నీకు తట్టే మిగులుతుంది అని హాసిని అంటుంది.
నేను పాపని బుట్టలు పెట్టడం ఏంటి అని సుమన అంటుంది. నేను చూశాను చిట్టి నువ్వు పాపని పెట్టడం అందుకే రాళ్ళని పెట్టాను అని హాసిని అంటుంది. ఆ రాళ్లు నువ్వు పెట్టావా అని సుమన అంటుంది. చిన్నపిల్ల గాయత్రి తను దూరమైతే తల్లి ఎంత తల్లడిల్లుతుందో నీకు కూడా తెలుసు కదా అని హాసిని అంటుంది. ఆ గాయత్రి మా అక్క కన్న కూతురు కాదు అనాధ పిల్లే కదా అని సుమన అంటుంది. హాసిని సుమన చంప మీద లాగిపెట్టి ఒకటిస్తుంది.. దీనితో ఈరోజే ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!