వర్మ పబ్లిసిటీ స్టంట్…
సినిమాలు తీయడం కంటే వాటిని పబ్లిసిటీ చేసుకోవడం తెలియాలి. ఈ విషయంలో రాంగోపాల్ వర్మను మించిన దర్శకుడు లేడు. వివాదస్పద చిత్రాలు చేయడమే కాదు.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై వర్మకు ఉన్న స్ట్రాటజీ మరెవ్వరికీ ఉండదు. ఈయనకు సోషల్ మీడియా మాధ్యమం ఎలాగూ ఉంది. దాని సహాయంతో తన సినిమాలను ట్రెండింగ్లో ఉంచుకునేలా చూడటంతో రాంగోపాల్ వర్మ కింగ్. ఇప్పుడు `లక్ష్మీస్ ఎన్టీఆర్` విషయంలో కూడా వర్మ మీడియాను వాడేసుకుంటున్నాడు. అందుకు ఉదాహరణం నిన్న జరిగిన విషయం. సెన్సార్ బోర్డు సినిమాను ఎన్నికల వరకు ఆపమన్నారని.. కాబట్టి తాను సెన్సార్ బోర్డుపై కోర్టుకు వెళతానని వర్మ నిన్న ఉదయం ట్వీట్ చేశాడు.. దాంతో ఆ విషయం సోషల్ మీడియాలో పెద్ద ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. ప్రెస్మీట్ కూడా పెట్టడానికి వర్మ సిద్ధమైపోయాడు. అయితే మళ్లీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సెన్సార్ బోర్డు వారికి, తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయని.. వారు తన సినిమాను చూస్తారని ట్వీట్ చేశాడు. వర్మకు ముందే తెలుసో.. లేక పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నాడేమో కానీ మధ్యలో తన సినిమా `లక్ష్మీస్ ఎన్టీఆర్`కు కావాల్సినంత పబ్లిసిటీని రాబట్టేసుకున్నాడు. ఇప్పుడు కొత్త ట్వీట్తో మళ్లీ తన సినిమాను వార్తల్లో ఉంచుకుంటున్నాడు. ఇదేమిటని ఎవరైనా వర్మను అడిడినా? నా మాటలను నమ్మాలని నేను కూడా చెప్పనే.. నేను అంతే!! అని మీడియా ముందే చెప్పడం వర్మకే సాధ్యం. వర్మ గురించి ఇన్ని విషయాలు తెలిసినా.. మీడియా వర్మకు ప్రాధాన్యత ఇవ్వడంలో ముందుంటుంది. ఏదేమైనా వర్మ పబ్లిసిటీ స్టంట్ మరోసారి బాగానే వర్కవుట్ అయ్యింది.
previous post
next post
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!