సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత, గిన్నిస్బుక్ రికార్డ్ హోల్డర్ శ్రీమతి విజయ నిర్మల(73) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో విజయనిర్మల కన్నుమూశారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో జన్మించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
నటనపై ఆసక్తితో…
ప్రముఖ గాయని బాలసరస్వతిదేవి విజయనిర్మల మేనత్త కూతురు. అలాగే నటి జయసుధ పెదనాన్న మనవరాలు. విజయనిర్మలకు నాట్యం మీద ఉన్న అభిరుచిని గమనించిన ఆమె తండ్రి తిరువెంకట మొదలియార్ వద్ద భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. ఆమె నాట్యం చేయడం గమనించిన ఆమె తండ్రి స్నేహితుడు పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘మచ్చరేఖై’ సినిమాలో అవకాశం ఇప్పించారు ఆ చితంలో హీరోయిన్ పద్మిని చిన్ననాటి పాత్రను పోషించారు విజయనిర్మల. తర్వాత ‘సింగారి’, ‘హమ్ పంచి ఏక్ డాల్ కే’, ‘గుణసుందరి కథ’ చిత్రాల్లో నటించింది.
దిష్టి తీసిన ఎన్.టి.ఆర్
కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ‘పాండురంగమహత్యం’లో బాలకృష్ణుడిగా నటించారు విజయనిర్మల. ఆ సమయంలో ఓ సారి కళ్లు తిరిగి పడిపొతే రామారావు ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీయించారు. తరువాత భూకైలాస్ చిత్రంలో ‘రాముని అవతారం రఘుకుల సోముని అవతారం..’ సినిమాలో సీత పాత్రలో కనిపించారు. 1964లో విన్సెంట్ దర్శకత్వంలో ‘భార్గవి నిలయం’ సినిమాతో మలయాళంలో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కల్యాణ ఫొటో, కల్యాణ రాత్రియిల్, పూచక్కణి, అన్వేపిచ్చు, కండదిల్లా, పూజ, రోసి, కరుత్త పౌర్ణమి, వివాహం స్వర్గత్తిల్ వంటి మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. హీరోయిన్గా మారిన తర్వాత తెలుగులో రంగులరాట్నం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
కృష్ణతో పరిచయం.. పెళ్లి
డైరెక్టర్ బాపు తొలి చిత్రం ‘సాక్షి’. ఇది కృష్ణకు ఐదవ సినిమా కాగా.. విజయ నిర్మలకు మూడో సినిమా. ఈ సినిమా కోసం పులిదిండి మీసాల కృష్ణుడి గుడిలో కృష్ణ, విజయనిర్మలపై పెళ్లి సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఆ గుడి మహత్యం తెలిసిన రాజబాబు, మీరు నిజజీవితంలో దంపతులవుతారంటూ విజయనిర్మలను ఆటపట్టించారు. చివరకు అదే నిజమైంది. సాక్షి తర్వాత వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ పరిచయం కాస్త పరిణయం వరకు దారి తీసింది. 1964లో కృష్ణ, విజయనిర్మల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించారు విజయనిర్మల.
హీరోయిన్.. దర్శకురాలిగా..
కృష్ణ సహకారంతో హీరోయిన్ నుండి దర్శకురాలిగా మారారు. ‘కవిత’ అనే మలయాళ చిత్రంతో దర్శకురాలిగా మారారు. ‘మీనా’ తెలుగులో ఆమె డైరెక్ట్ చేసిన తొలి సినిమా. తర్వాత కృష్ణతో దేవదాసు తెరకెక్కించారు. ఆ తర్వాత కవితను తెలుగులో అదే పేరుతో తెరకెక్కించారు. దేవుడే గెలిచాడు సినిమాలు చేశారు. క్రమంగా కమర్షియల్ సినిమా డైరెక్టర్గా కూడా ఆమె పేరు సంపాదించుకున్నారు. నాగేశ్వరరావు, కృష్ణతో హేమాహేమీలు, శివాజీగణేశన్, కృష్ణతో బెజవాడ బొబ్బులి, కృష్ణ, రజనీకాంత్తో రామ్ రాబర్ట్ రహీమ్ చిత్రాలను డైరెక్ట్ చేసి
అవార్డులు
2000 సంవత్సరంలో అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్బుక్ రికార్డ్ను సాధించారు. అప్పటివరకు ఇటలీకి చెందిన మహిళా దర్శకురాలి పేరుని చెరిపేశారు విజయనిర్మల. అలాగే 2008లో రఘుపతి వెంకయ్య అవార్డుని కూడా దక్కించుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుని దక్కించుకున్న వారిలో విజయనిర్మల ఆరో వారు.. మహిళల్లో రెండోవారు కావడం గమనార్హం.
విజయనిర్మల మృతికి సినీ పరిశ్రమ యావత్తు సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!