Mahesh-Vikram: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ తన 28వ ప్రాజెక్ట్ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రకటించాడు.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఈ నేపథ్యంలోనే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలె పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై సూర్యదేవర రాధా కృష్ణ (చినబాబు) నిర్మించబోతున్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ కానుంది. అయితే ఈ సినిమాలో మహేష్కు విలన్గా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించబోతున్నాడని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ డిజైన్ చేసిన విలన్ రోల్కు విక్రమ్ బాగా సెట్ అవుతాడనే ఉద్దేశంతో.. ఇటీవలె మేకర్స్ ఆయనను సంప్రదించాడట.
కథ, తన పాత్ర నచ్చడంలో ఆయన వెంటనే ఓకే చెప్పాడని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రచారంపై విక్రమ్ మేనేజర్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ సినిమాలో విక్రమ్ విలన్గా నటిస్తున్నాడన్న వార్త కేవలం పుకారే అని.. ఇప్పటి వరకు విక్రమ్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన తేల్చేసినట్లు సమాచారం.