వీవీ నాయక్ .. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు. ఆది, దిల్, ఠాగూర్ లాంటి సెన్సేషనల్ మాస్ సినిమాలను పరిశ్రమకు ఇచ్చాడు. నటుడిగానూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ‘శీనయ్య’ అనే సినిమా చేస్తున్న వినాయక్.. మళ్లీ మెగాఫోన్ పట్టనున్నాడని సమాచారం. శీనయ్య సినిమా పూర్తవ్వగానే ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిశాయని.. ఓ పెద్ద హీరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
సి. కల్యాణ్ నిర్మాణంలో సాయిధరమ్ తేజ హీరోగా నటించిన ఇంటెలిజెంట్ సినిమా డైరెక్టర్గా వినాయక్కు చివరిది. 2018లో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. దర్శకత్వ బాధ్యతలు స్వీకరించనున్నాడన్న వార్తలు నిజమైతే.. మరో సూపర్ హిట్ ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!