Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వాయిదా పడింది. ఆయన ఈ నెల 15 లేదా 16 తేదీల్లో పార్టీలో చేరనున్నారు. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14న కిర్లంపూడి నుండి భారీ ర్యాలీగా తాడేపల్లికి చేరుకుని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇందుకు గానూ తనతో కలిసి ప్రయాణం చేయాలనుకునే అభిమానులు తరలిరావాలని కూడా ముద్రగడ పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో ర్యాలీలో పాల్గొనే వారు ఎవరి భోజనం వాళ్లే తెచ్చుకోవాలని, వాహనాలు కూడా సొంతంగానే సమకూర్చుకోవాలి ఆయన ఇటీవల తన అభిమానులకు లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే వైసీపీలో తన చేరిక వాయిదా పడినట్లుగా ముద్రగడ తాజాగా మరో లేఖ విడుదల చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా తాడేపల్లికి వెళితే అక్కడ ఎక్కువ మంది కూర్చోడానికి కాదు, నిలబడటానికి కూడా స్థలం సరిపోదని, అదే క్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల అభిమానులతో కలిసి వెళ్లే కార్యక్రమాని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అభిమానులను నిరుత్సాహపర్చినందుకు మరో సారి క్షమాపణలు తెలియజేశారు ముద్రగడ.
ఈ నెల 15, 16 తేదీల్లో తాను ఒక్కడినే తాడేపల్లి వెళ్లి సీఎం సమక్షంలో పార్టీలో చేరతానని తెలియజేశారు. కిర్లంపూడి నుండి తాడేపల్లి ర్యాలీకి భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తొంది. అంతే కాకుండా ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కర్నూల్, నంద్యాల జిల్లాల పర్యటనలు ఉండటం కూడా ముద్రగడ చేరిక వాయిదా పడటానికి ఒక కారణమని అంటున్నారు. ఈ నెల 15 లేదా 16 తేదీల్లో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది.
BRS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా