నమ్రతా శిరోద్కర్ ఈ పేరు తెలియని వారెవరూ ఉండరూ.. ఎన్నో సినిమాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నారు. 1993 మిస్ ఇండియాగా ఎంపికయ్యారు నమ్రతా శిరోద్కర్. దాని తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో నటిస్తూ అభిమానుల గెండెల్లో చోటును సంపాధించుకున్నారు. కాగా 2005 లో మహేశ్ బాబుతో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె సినీ ఇండిస్ట్రీకి కొంచెం దూరంగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఇంటి బాధ్యతలను చూసుకుంటూ సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ యాక్టీవ్ గా పాల్గొంటు ఉంటారు.
కాగా ఆమె తన తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మహేశ్ బాబు అభిమానులకు కూడా సరైప్రైజ్ లను ఇస్తూ ఉంటారు. కాగా తాజాగా ఆమె మహేశ్ బాబు ఫ్యాన్స్ ను సరైప్రైజ్ చేశారు నమత్రా శిరోద్కర్. ఆమె పెట్టిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నమ్రత భర్త మహేశ్ బాబు, కొడుకు గౌతమ్ లతో పాటుగా వాళ్ల పెంపుడు కుక్కతో కలిసి దిగిన ఓ ఫోటోను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇంకేముంది మిల్క్ బాయ్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ కుషీగా ఫీలవుతున్నారు. ఆ పోస్ట్ తో పాటుగా నమ్రతా క్రేజీ క్యాప్షన్ ను పెట్టారు. ఇంట్లో అంతా మగవాళ్లే అంటూ ఆమె ఫోటో క్యాప్షన్ కూడా జతచేశారు. ఇంకేముంది దానికి నెటిజన్ల నుంచి మంచి మంచి కామెంట్లు కూడా అందుకున్నారు. కాగా కొన్ని రోజులుగా మహేశ్ బాబుకు సంబంధించిన కొన్ని క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నమ్రతా మిల్క్ బాయ్ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంది. కాగా ఇంతకు ముందు నమ్రత పెట్టిన ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది.
నమ్రతా, మహేశ్ బాబులు పెళ్లికి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే తాజాగా కరోనా కు ముందు సమ్మర్ వెకేషన్ కు వెళ్లినప్పుడు మహేశ్ బాబు దిగిన ఒక పిక్ ను కూడా నమ్రతా ఫ్యాన్స్ కు కానుకగా ముందుంచుంది. ఇదిలా ఉండే వరుస సినిమాలతో బిజీబిజీ గా గడుపుతున్నారు కలల రాకుమారుడు సుపర్ స్టార్ మహేశ్ బాబు. అయితే సర్కారీ వారి పాట సినిమాతో బిజీగా ఉండబోతున్నారు మహేశ్ బాబు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథా నాయికగా నటించబోతున్నారు.