తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో చెల్లకుండా ఓటు వేసి, ముగ్గురు టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. దీంతో జగన్ కు వారు మద్దతు తెలపలేకపోయారు. తమకు తమ పదవులే ముఖ్యం అని చాటుకున్నారు. దీంతో తెలుగుదేశం ప్లాన్ ఫలి౦చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
అయితే సంఖ్యా బలం చూస్తే, నాలుగు సీట్లు వైసిపీకే దక్కుతాయి. కాని తెలుగుదేశం పార్టీ మాత్రం, వ్యుహత్మికంగా పోటీకి పెట్టింది.ముఖ్యంగా ఇటీవల టిడిపికి గుడ్బై చెప్పి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు కరణం బలరామ్ వల్లభనేని వంశీ మద్దాళి గిరి లను టార్గెట్ చేసుకుని వ్యూహం పన్నింది రూపొందించుకుంది .ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇస్తున్నప్పటికీ సాంకేతికంగా టిడిపి ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు .వీరికి టిడిపి విప్ కూడా వర్తిస్తుంది.దీన్నే టిడిపి తన అస్త్రంగా చేసుకుంది ఎలాగూ తమ పార్టీ అభ్యర్థి రామయ్య ఓడిపోతాడని అపార్టీకి తెలుసు.కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను బుక్ చేయడానికి చేయడానికి టిడిపి విప్ జారీ చేసింది.విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు వెయ్యాలని, చెల్లకుండా వేస్తే, తమకు జగన్ కంటే, పదవులే ముఖ్యం అని వారే తెలిపినట్టు అవుతుందని తెలుగుదేశం వేసిన అంచనా కరెక్ట్ అయ్యింది. ఆ ముగ్గురు టిడిపి అభ్యర్థి రామయ్యకు చెల్లకుండా ఉండే విధంగా ఓట్లు వేశారు తప్ప వైసీపీ అభ్యర్థులకు వెయ్యలేదు.ఈమధ్య కాల౦లో వైసీపికి మద్దతిస్తున్న ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు చంద్రబాబును విమర్శించటం, జగనుని పొగడడం వంటివి చేశారు.
మేము జగన్ అభివృద్ధి చూసి జగన్ వైపు వచ్చాం, తెలుగుదేశం పార్టీ పని అయిపొయింది అంటూ చెప్పటం చూసిన వారు, వీరు టిడిపి ఇచ్చిన విప్ ధిక్కరించి, వైసిపీ చెప్పిన అభ్యర్ధికి ఓటు వేసి, జగన్ పై తమ ప్రేమ చూపిస్తారని అందరూ అనుకున్నారు. అయితే వీరి మాటలు అన్నీ బిల్డ్ అప్ వరకే అని తేలిపోయింది. టిడిపి విప్ ధిక్కరిస్తే, అనర్హులం అవుతాం, ఎమ్మెల్యే పదవి పోతుంది అని ఈ టిడిపి రెబెల్ ఎమ్మెల్యేలు భయపడ్డారు.అందుకనే సాంకేతికంగా తప్పు చేసి తప్పించుకున్నారు
కానీ వైసీపీ శ్రేణులు ఈ పరిణామం పట్ల హ్యాపీగా లేరని జగన్ ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.