Adipurush : ప్రభాస్ సినిమా అంటే ప్రతి విషయం పాన్ ఇండియన్ రేంజ్ లోనే మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాస్ రేంజ్ అండ్ క్రేజ్ ఆ రేంజ్ లో మార్చేసింది. డార్లింగ్ ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతలు ఖచ్చితంగా భారీ బడ్జెట్ కేటాయించాల్సిందేనని ఇప్పటికే అందరికీ పక్కాగా క్లారిటీ వచ్చేసింది. అందుకే బాహుబలి కంటే ముందే సాహో సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేశారు. ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ మార్కెట్ భారీగా పెరిగింది. అప్పటి నుంచి బాలీవుడ్ మేకర్స్ కూడా ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కమిటయిన సినిమాలన్ని పాన్ ఇండియన్ టార్గెట్ గానే నిర్మిస్తున్నారు. రాధే శామ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా, సలార్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా, ఆదిపురుష్ పౌరాణిక సినిమాగా రూపొందుతున్నాయి. రాధే శ్యామ్ ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. సలార్ ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాల కామన్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్స్. సినిమా షూటింగ్ మొదలైన చాలా రోజులకి గానీ మ్యూజిక్ డైరెక్టర్స్ ని అనౌన్స్ చేయడం లేదు.
Adipurush : ఈ పౌరాణిక సినిమాకి వీరిని తీసుకున్నారట మేకర్స్
రాధే శ్యామ్ కి తమిళ సంగీత దర్శకుడు, బాలీవుడ్ సంగీత దర్శకులు సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆదిపురుష్ కి బాలీవుడ్ సంగీత దర్శకులనే ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. సాహో సినిమాలో ఒక సాంగ్ కి సంగీతం అందించిన సచేత్ – పరంపర ఫైనల్ అయ్యారని సమాచారం అందుతోంది. వీరికి హిందీ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ పౌరాణిక సినిమాకి వీరిని తీసుకున్నారట మేకర్స్. అయితే ఈ విషయాన్ని మాత్రం ఇంకా ఎవరి సైడ్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. మొదటి నుంచి ఆదిపురుష్ మేకర్స్ సర్ప్రైజ్ గానే అప్డేట్స్ ఇస్తున్నారు. ఇది కూడా త్వరలో సర్ప్రైజింగ్ గా అప్డేట్ రానుందని సమాచారం.