Sarainodu : సరైనోడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చి బిగ్ హిట్ సాధించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ కేటాయించి నిర్మించారు. ఇది అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమా గా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధమైన వసూళ్ళు రాబట్టింది. అల్లు అర్జున్ కి సరైనోడు సినిమా ఓ మైల్ స్టోన్ సినిమాగా తన టాప్ టెన్ సినిమాలలో నిలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు.
ఇండస్ట్రీలో ఓ సినిమా సూపర్ హిట్ భారీ వసూళ్ళు తెస్తే మళ్ళీ అదే కాంబినేషన్ సెట్ చేయాలనుకోవడం చాలా కామన్. కానీ ఈ కాంబో వెంటనే సెట్ కాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం స్టార్ అయింది. ఇటీవలే గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను అల్లు తో కథ గురించి చర్చలు సాగించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణతో ఇప్పుడు అఖండ అనే ఒక యాక్షన్ సినిమా చేస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చిందని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఇందులో ఇంకా శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Sarainodu : అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది.
ఈ చిత్రాన్ని పూర్తి చేశాక గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను పాన్ ఇండియన్ సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్నాడని ప్రచారం వేడెక్కుతోంది. అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప రెండు భాగాలలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకుడు. తెలుగు, హిందీ తో పాటు మరో మూడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో చేయనున్నట్టు ఎప్పుడో ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇంకా ఒక క్లారిటీ లేదు. కొరటాల శివ ఆచార్య పూర్తి చేసి, ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుంది. కానీ వీటి మీద క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టేలా ఉంది.