Pawan Kalyan Press Meet: ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం ప్రతిపక్షానికి మామూలే.ప్రభుత్వంపై బురద జల్లడానికి చేతికి దొరికిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయి.దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.కానీ ఈ క్రమంలో చీప్ ఎత్తుగడలు వస్తే మాత్రం ప్రజలకు అడ్డంగా దొరికిపోతారు.అదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో జరిగింది.సొంత పార్టీ వారు సైతం ఆయన యాక్టింగ్ స్కిల్స్ ను ఏవగించుకుంటున్నారు. ట్రోల్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలేం జరిగిందంటే!
జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు.ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కరెంటు పోయింది.దాంతో పవన్ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసుకొని ఆ వెలుగులో మాట్లాడారు మీడియా ప్రతినిధులు కూడా సెల్ ఫోన్లు ఆన్ చేసి ఆ కాంతిలోనే పవన్ చెప్పేది విన్నారు. కాగా ఈ చీకటి ప్రెస్ మీట్ ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.జగన్ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని,కరెంటు ఉండడం లేదని సింబాలిక్ గా చెప్పడానికి పవన్ కల్యాణ్ ఇలా చేశారన్నది స్పష్టం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జవాబు దొరకని ప్రశ్నలు!
అయితే ఇదంతా జనసేన పార్టీ అధినేత కావాలనే చేసినట్లు,కరెంటు డ్రామా ఆడినట్లు భావించాల్సి ఉంటుంది.అత్యధిక పారితోషికం తీసుకునే పవర్ స్టార్ సొంత పార్టీ కార్యాలయంలో జనరేటర్ ఉండకపోతుందా అనే ప్రశ్నకు జవాబు దొరకడం లేదు.జనరేటర్ కాకపోతే ఇన్వర్టర్ అయినా ఉండి ఉండాలి కదా! ఈరోజు సామాన్యులు కూడా కరెంటు పోగానే ఆటోమేటిక్ గా వెలిగేలా 150 రూపాయలు చేసే “చార్జింగ్ బల్బ్స్” తమ ఇళ్లలో పెట్టుకుంటున్నారు.ఆ మాత్రం సొమ్ము కూడా పవన్ వద్ద లేదా?జనసేన పార్టీ అంత బీద దా అని ప్రజలే చర్చించుకుంటున్నారు.ఇదొక డ్రామా అని వారికి కూడా అర్థమైపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కావాలనే మెయిన్ ఆపేశారా?
ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే ప్రజల దృష్టిని ఆకర్షించడానికి పవన్ కల్యాణ్ ప్రెస్మీట్ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యాలయంలో ఎవరో కావాలనే మెయిన్ ఆపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కల్యాణ్ సినిమా వాడు కాబట్టి ఇలాంటి సినిమా ట్రిక్స్ ఆయనకు అలవాటేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితులు అయిన సినీ దర్శకులు త్రివిక్రమ్ లేదా హరీష్ శంకర్ ఈ ఐడియా ఇచ్చి ఉంటారని కూడా సెటైర్లు పడుతున్నాయి.ఏదేమైనా పవన్ కల్యాణ్ ‘చీకటి’ ఎత్తుగడ ఫలించలేదనే ,రాజకీయ మైలేజ్ లభించలేదనే చెప్పాలి.