Pensions Distribution: ఏపీలో ఫించన్ల పంపిణీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీపై ఈసీ ఆంక్షలు జారీ చేసిన నేపథ్యంలో దీనికి టీడీపీయే కారణం అంటూ అధికార వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయకపోతే వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారని వైసీపీ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో లబ్దిదారుల ఇళ్ల వద్దనే పంపిణీ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫోన్ చేసి కోరారు.
ఇదిలా ఉంటే ఏపీలో పింఛనల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. బుధవారం (3వ తేదీ) నుండి ఏప్రిల్ 6వరకు కేటరిగిల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొందరికి ఇంటి వద్దే ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు, అస్వస్థతకు గురైన వారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను ఆదేశించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం 1.27 లక్షల సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో రెండు కేటగిరిలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకూ సచివాలయాలు పని చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుండి ప్రారంభించి ఏప్రిల్ 6 నాటికి పంపిణీ ముగించాలని ఆదేశించింది.
YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల