ప్రపంచ దేశాలన్నీ కనిపించని కరోనా వైరస్ తో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. కరోనాను తరిమికొట్టడానికి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకోపక్క కరోనా తన ప్రతాపాన్ని చూపెడుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలిగొంటూనే ఉంది. రోజుకు ఎంతో మంది కరోనా భారిన పడుతూనే ఉన్నారు. అయినా కరోనా వ్యాక్సిన్ మాత్రం రావడం లేనేలేదు. శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉన్నారు. వచ్చే ఏడాదికల్లా కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రజలు మాత్రం వైద్యులకు, శాస్త్రవేత్తలకు భారీ షాక్ ను ఇస్తున్నారు. కరోనా భారీ నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. పగలురాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. ఈ రోగాన్ని తరిమేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చినా తమకు వ్యాక్సిన్ వద్దని ప్రజలు తెలుపుతున్నారట.
దేశంమొత్తం మీద 61 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన మొదట్లో కరోనా వల్ల జనాలకు ప్రాణాలు పోతాయనే భయం ఉండేది. కాలంతో పాటుగా వారు కూడా కరోనా వైరస్ ను ఇది ఒక సాదారణ ఫ్లూ కిందే లెక్క చేస్తున్నట్టు తెలుస్తోంది. దీని కారణంగానే కావచ్చు.. కరోనా వ్యాక్సిన్ వద్దంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక సర్వే అధ్యాయనంలో తెలిసిన విషయమేమంటే 2021 జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చినా అది వేయించుకోవడానికి మేము సిద్ధంగా లేమంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫాం అనే ఆన్ లైన్ లో సర్వేను నిర్వహించి ఈ విషయాలను వెల్లడించింది. 51 శాతం మంది ఈ కరోనా వ్యాక్సిన్ ను చేయించుకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని వెల్లడించారు. 10 శాతం తమకు వ్యాక్సిన్ వద్దేవద్దంటూ ఖరాఖండీగా చెబుతున్నారట. ఇందులో 72 శాతం పురుషులు, 54 శాతం మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారని సమాచారం. కరోనా వ్యాక్సిన్ పై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందు ఈ సర్వే నిర్వహించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సర్వేలో 8,496 మంది పాల్గొన్నారు. వారిలో 20 వాతం మంది ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు.