మతం అనేది అనాదిగా మనిషి మనసులను కలుషితం చేస్తోంది. ఇక రాజకీయ నాయకులు మతం పేరిట తరతరాలుగా జనాలని బలిపశువుల్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే మారుతున్న కాలంలో కూడా చాలా మంది కులాలు, మతాల పేరిట సమాజంలో అసహనాన్ని సృష్టిస్తున్నారు. కొందరు కట్టుబాట్లు పేరుతో ఇంకా వారు గీసుకున్న బరిలోనే బతికేస్తున్నారు. తాజాగా భోజ్ పురి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోయిన్ సహర్ అఫ్సా ఓ సంచలన ప్రకటన చేసి, వార్తల్లో నిలిచింది.
విషయం ఏమంటే తాజాగా ఆమె ఓ మీడియా వేదికగా ఇక తాను సినిమాల్లో నటించబోవడంలేదని, అర్ధ నగ్న ప్రదర్శనలు చేయబోనని, పిచ్చి పిచ్చి వేషాలు వేయబోనని ఖరాఖండిగా చెప్పేసింది. బేసిగ్గా హీరోయిన్లు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనప్పుడు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేయడం మనం చూసాం. అయితే ఈ అమ్మడు మతం కోసం సినీ రంగాన్ని వదిలేస్తున్నట్టు వెల్లడించడం అందరినీ ఒకింత విస్మయానికి గురి చేస్తోంది.
దాంతో యావత్ భోజ్ పురి చిత్ర పరిశ్రమ అవాక్కయింది. దాంతో అనేకమంది సినిమా పండితులు, అభిమానులు ఆమెని ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్నేళ్లు గుర్తుకు రాని ఇస్లాం మతం ఇప్పుడు గుర్తొచ్చిందా అని కొందరంటే, సినిమా పరిశ్రమలో వుంటూ పవిత్రంగా బతకడం ఆమెకి చేతకాదేమో అని కొందరు, ఇదొక చీఫ్ పబ్లిసిటీ కోసమే ఆలా చేస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సహర్ అఫ్సా మాత్రం తాను తీసుకొన్న నిర్ణయం… తన జీవితంలో అత్యుత్తమ నిర్ణయం అని చెప్పడం కొసమెరుపు.