ఇటు సౌత్ లో మరియు అటు బాలీవుడ్ లోనూ తన నటనతో పూజా హెగ్డే తన సత్తా చూపిస్తుంది. ప్రస్తుతం అల్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉంది పూజా హెగ్డే. ఈ ముద్దుగుమ్మ తన మొదటి సంపాదనతో ఏం చేసిందో తెలిస్తే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఆలా వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ అందుకున్నాక ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయకగా నిలవడంతోపాటు టాప్ హీరోల అందరి ఫస్ట్ ఛాయిస్గా మారింది పూజ హెగ్డే. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పడు తన సోషల్ మీడియా వేదికగా తన సినిమాలతో పాటు తన పర్సనల్ విషయాలను కుడా పంచుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమాను ఆల్ ఇండియా బ్లాక్బస్టర్ సినిమా గా నిలిచిన బాహుబలి సినిమా విడుదలైన రోజు, ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాలతో బిజీ కానున్నదట.
పూజా హెగ్డే కి వాళ్ల అమ్మ తను సినిమాల్లో రాకముందు నుంచే డబ్బును ఖర్చు పెట్టే విషయంలో ఎలా ఉండాలి అని కొన్ని పాఠాలు నేర్పారంట. అందుకే ఇప్పటికి పూజా హెగ్డే తను సంపాదించిన సంపాదనను వాళ్ళ అమ్మ చేతిలోనే పెడుతుందట. కానీ ఆమె తొలి సంపాదనను పూజా హెగ్డే BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్వర్ కలర్ కారును కొనడానికి ఉపయోగించిందట. ఈ కారు ఇప్పటికీ పూజా హెగ్డే దగ్గరే ఉందట. తన మొదటి సంపాదనతో కొన్న కారు అవ్వడంతో ఈ కార్ అంటే పూజాకు ప్రాణం అట. పూజా హెగ్డే ఆ కారును ఎంతో అపురూపంగా చూసుకుంటుందని పూజ సన్నిహితులు చెబుతున్నారు..