Radheshyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్లో అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో మాత్రమే కాకుండా దేశ విదేశాలలో మన డార్లింగ్ ప్రభాస్కు అభిమానులు, అభిమాన సంఘాలున్నాయంటే ఆయన రేంజ్ ఎంతగా పెరిగిందో తెలుస్తోంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న ప్రభాస్ అందుకు ఏమాత్రం తగ్గకుండా తన ప్రాజెక్ట్స్ను పాన్ ఇండియా లెవల్లోనే లైనప్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ మీదే వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది.
ఇక ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. పీరియాడికల్ వింటేజ్ లవ్స్టోరిగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ ఓ విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందులో ప్రభాస్ పామిస్ట్గా కనిపించబోతున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు చేయలేదు. ఇక ఇలాంటి రొమాంటిక్ లవ్స్టోరి కూడా ఇంతవరకు చేయలేదు. దాంతో ఈ సినిమాపై అన్నీ రకాలుగా ఊహించని విధంగా అంచనాలు నెలకొన్నాయి.
Radheshyam: రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
కాగా, జనవరి 14న భారీ స్థాయిలో 7 భాషల్లో రిలీజ్ కానున్న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ నెవర్ బిఫోర్ అనేలా ప్రభాస్ ఫ్యాన్స్కు భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేస్తున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో ట్రైలర్ను అభిమానులే రిలీజ్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది బిగ్ ట్రీట్ అని చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానుల కోసం ఇచ్చే సర్ప్రైజెస్ మరో రేంజ్ అని చెప్పుకోవాల్సిందే. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ – టీ సిరీస్ కలిసి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి.