ఒక మంచి భారీ హిట్టు కోసం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఎదురుచూస్తున్నారు. 2018లో “బాహుబలి 2” తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. పైగా చేసిన సాహో, రాదేష్యం రెండు కూడా చాలా టైం తీసుకోవడం జరిగింది. ఒక్కో సినిమాకి దాదాపు ఏడాదిన్నరకు పైగానే సమయం కేటాయించటం తో పాటు మధ్యలో రెండు సంవత్సరాలు పాటు కరోనా రావటంతో ప్రభాస్ కెరియర్ పిక్ లో ఎదురు దెబ్బలు తగిలినట్లు పరిస్థితి మారింది.
దీంతో ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులపై ప్రభాస్ చాలా శ్రద్ధ పెడుతున్నారు. అంత మాత్రమే కాదు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలలో.. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. “కేజిఎఫ్ 2” తో ఇటీవల వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడంతో “సలార్” పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా యాక్షన్ సన్నివేశం కోసం ఇప్పుడు ప్రభాస్ లోయలో ఫైట్ చేయడానికి రెడీ అయ్యారంట. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సన్నివేశం హైలైట్ గా ఉంటుందని సమాచారం.
అంతే కాదు ఇదే లోయలో చేజింగ్ సన్నివేశాలు కూడా… తెరాకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. “సలార్” వచ్చే ఏడాది వేసవి సందర్భంగా విడుదల కానుంది. ప్రభాస్ సరసన సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ కి మర్చిపోలేని హిట్ ఇచ్చే దిశగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అక్టోబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లేదా వీడియో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.