Prabhas : కరోనా ప్యాండమిక్ నుంచి కాస్త బయటపడిన ఇండస్ట్రీ రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలతో పాటు షూటింగ్ దశలో ఉన్న సినిమాలను చక చకా పూర్తి చేసి వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అనుకున్న పాన్ ఇండియన్ సినిమాలు వచ్చే ఏడాదికి షిఫ్ట్ అవుతున్నాయి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమా ఈ ఏడాదిలో వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి గట్టి షాకిచ్చారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. అయితే జూలై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను 2022 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు పరశురాం కాంబినేషన్లో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమాను 2022 సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. దాంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఫైట్ ఉండటం ఖాయమని ఈ సినిమాలతో అర్థమవుతోంది. అయితే ఈ రెండిటికంటే ముందే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియుం సినిమా తెలుగు రీమేక్ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. కానీ డేట్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇప్పుడు రాధే శ్యాం, సర్కారు వారి పాట సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అవడంతో అందరి దృష్టి పవన్ సినిమా మీద పడింది.
Prabhas : ప్రభాస్, మహేష్ తో పవన్ – రానాల మల్టీ స్టారర్ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి రానుంది.
రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. త్రివిక్రం శ్రీనివాస్ ఈ సినిమాను పర్యవేక్షిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ప్రభాస్, మహేష్ తో పవన్ – రానాల మల్టీ స్టారర్ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీకి రానుంది. కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడనేదే ఆసక్తికరంగా మారింది. 11,12, 14, 15 తేదీలలో ఒక డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఆ సమయానికి వెంకటేశ్ – వరుణ్ తేజ్ లు నటిస్తున్న ఎఫ్ 3 కూడా వచ్చే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.