Radhe Shyam : డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వరుస పాన్ ఇండియా సినిమాలతో మన డార్లింగ్ మంచి బిజీగా వున్నాడు. ఇక ఈయన నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ‘జిల్’ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డార్లింగ్ పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రశీదలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండు సంవత్సరాల తరువాత డార్లింగ్ నుండి సినిమా రావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
Radhe Shyam : విదేశాల్లో రాధేశ్యామ్?
ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఐమాక్స్లో 90శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది ఓ అరుదైన రికార్డు ఎందుకంటే రాధేశ్యామ్ సినిమా ఇంకా విడుదల అవ్వకుండానే టికెట్లు అక్కడ భారీగా అమ్ముడవడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఒక సినిమాకు ఇన్నిరోజుల ముందే ఇంత మొత్తం టికెట్లు అమ్ముడవడం ఇదే మొదటిసారట. ఇక దానికి కారణం బాహుబలి సినిమానే అన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.
మరిన్ని వివరాలు:
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్కు సరసన పూజాహెగ్డే నటిస్తోంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-K సినిమా షూటింగ్లలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఆది పురుష్ సినిమా షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక దీంతో పాటుగా సందీప్రెడ్డి వంగా, మారుతి దర్శకత్వంలో సినిమాలను చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.