రకుల్ ప్రీత్ సింగ్ ఇంతక ముందు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. దాదాపు అందరు టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితోను బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. మూడు నాలుగు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ లో ఉంది రకుల్. అంతేకాదు హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంది కూడా రకుల్ మాత్రమే. అయితే అనూహ్యంగా వరసగా ఫ్లాప్స్ రావడంతో గత రెండేళ్ళు గా రకుల్ కి పెద్దగా ఆఫర్లు లేవన్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరోయిన్ గా కోటి పైనే రెమ్యూనరేషన్ తీసుకున్న రకుల్ సంవత్సరంలో 3-4 సినిమాలు చేసింది. అలాంటిది ఇప్పుడు రెండు సినిమాలు చేసే అవకాశం కూడా రావడం లేదని అంటున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున తో నటించిన మన్మదుడు 2 మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది రకుల్. కాని ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో రకుల్ కి ఇక టాలీవుడ్ లో అవకాశాలు దక్కలేదు.
అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి రకుల్ ప్రీత్ సింగ్ కి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న తాజా చిత్రంలో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది. అయితే గత వారంలో వికారాబాద్ ఫారెస్ట్ లో ప్రారంభం అవ్వాల్సిన చిత్రీకరణ యూనిట్ సభ్యుల్లో ఒకరికి కరోనా రావడంతో వాయిదా పడినట్టు సమాచారం.
కాగా ఈ సినిమా కోసం రకుల్ తీసుకున్న పారితోషికం చాలా తక్కువన్న టాక్ వినిపిస్తుంది. కరోనా కారణంగా నిర్మాతల ఇబ్బందులను దృష్ఠిలో పెట్టుకొని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమాతో మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తుందట రకుల్.