Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీ దిశ దశ మార్చేశాడు ప్రభాస్. బాహుబలి విజయంతో తెలుగు సినిమాలకు ఎక్కడలేని ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా సంతరించుకుంది. దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు కూడా టాలీవుడ్ దర్శకులతో పనిచేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ బడా నిర్మాణ సంస్థలు టాలీవుడ్ దర్శకుల చేత సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీతిగా తెలుగు పరిశ్రమ క్యాతి నలుదిశలా వ్యాపించింది. దీనంతటికీ మూల కారణం ప్రభాస్. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా…సూపర్ స్టార్. చాలావరకు ప్రభాస్ పాన్ ఇండియా .. బడ్జెట్ సినిమాలనే ఒప్పుకుంటూ ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ మాదిరిగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. పాన్ ఇండియా స్ట్రాంగ్ లైనప్… మెయింటెన్ చేస్తున్నాడు.
ఆ తరహా సబ్జెక్ట్ కలిగిన దర్శకులను వరుసబెట్టి లైన్ లో పెడుతూ.. చాలా సైలెంట్ గా.. సినిమా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నాడు చరణ్. విషయంలోకి వెళ్తే రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే తాజాగా .. జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
చిరంజీవి సబ్జెక్టు విని…
ఇదిలా ఉంటే మరో క్రేజీ డైరెక్టర్ ని రామ్ చరణ్ లైన్ లో పెట్టడం జరిగిందట. కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్… సినిమా చేయడానికి రెడీ అయ్యారట. తాజాగా ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. కేజిఎఫ్ సినిమా తో తన సత్తా ఏంటో ఆలిండియా కి తెలియజేసిన ప్రశాంత్ నిల్… అదే టైపు సబ్జెక్టు చరణ్ కోసం రెడీ చేసినట్లు… చిరంజీవి సబ్జెక్టు విని చాలా ఎగ్జైట్ అయినట్లు.. ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన “RRR” పాన్ ఇండియా లెవెల్ లో.. రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లోకి సరికొత్తగా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో దాన్ని కొనసాగించేలా.. తనకంటూ సెపరేట్ గుర్తింపు ఉండేలా స్ట్రాంగ్ లైన్ ప్… దర్శకులతో చరణ్ పనిచేయడానికి సరికొత్త వ్యూహాలతో.. కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారట.