ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రేషన్ కార్డులను లేదా రైస్ కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాలలు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీన్ని పరిగణించి ఆచరణలో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం పేదలకు ఎంతో ఊరటనిచ్చేదే. ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం పేదలకు ఇకపై ఉండదు. రేషన్ కార్డులనే ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా చూపిస్తుండడంతో సంక్షేమ పథకాల అమలు మరింత సులువు కానుంది. మరోవైపు కరోనాపై యుద్ధంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. ఒకవైపు కేసులు వస్తున్నా విరివిగా టెస్టింగ్ చేస్తున్నారు.