మంచి కామెడీ టైమింగ్, రైమింగ్తో ప్రేక్షకులను ధియేటర్కు రప్పించిన మాస్ మహారాజ రవితేజ గత కొంత కాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా మారి మాస్ మహారాజ అన్న క్రేజ్ ని సొంతం చేకున్న రవితేజ హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నా అదే రేంజ్లో ఫ్లాప్స్ను చూస్తున్నాడు. కాగా తాజాగా రవితేజ నటిస్తున్న చిత్రం క్రాక్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవా లో జరుగుతోంది. సాంగ్ షూటింగ్ లో రవితేజ, శృతి హాసన్ పాల్గొంటున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి ఈ మాస్ మహరాజ్ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ‘క్రాక్’ షూటింగ్ చివరి దశలో ఉండటంతో రమేష్ వర్మ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేశారు. ఇకపోతే రవితేజ సినిమాకి సాయి మాధవ్ డైలాగ్స్ రాయడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమా కూడ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. కృష్ణం వందే జగద్గురుం’ చిత్రానికి మాటల రచయితగా చిత్ర పరిశ్రమకు సాయి మాధవ్ పరిచయం అయిన విషయం తెలిసిందే.
తర్వాత ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ చిత్రానికి కూడా డైలాగ్స్ అదించారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’తో సాయిమాధవ్ సినిమా రచయితగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలోనే, ‘‘బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీనెంబర్ 150’ చిత్రాలతో ఇండస్ట్రీలో రచయితగా సాయిమాధవ్ రేంజ్ మారిపోయింది. అందుకని రవితేజ సినిమాకి మాధవ్తో మాటలు రాయించి ఒక మాంచి హిట్ అందుకోవాలని, రవితేజకు పూర్వ వైభవం అందించాలని చిత్ర యూనిట్ ఎంతో ఆరాటపడుతున్నారని సమాచారం. మరి ఈ సినిమా తో అయినా రవితేజ ఇండస్ట్రీ రికార్డ్స్ ను అందుకుంటాడా లేదా చూడాలి.