RS Praveen Kumar: తెలంగాణ సాంఘీక గురుకులాల సొసైటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు రోజుల క్రితం స్వచ్చంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ప్రజాసేవ చేసేందుకే తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
అయితే ఆయనపై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మెజిస్ట్రేట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఈయన ఫిర్యాదు మేరకు కరీంనగర్ మూడవ పట్టణ పోలీసులకు మున్సిఫ్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు.