Sai pallavi : సాయి పల్లవి మలయాళ సూపర్ హిట్ సినిమా ‘ప్రేమమ్’ తో హీరోయిన్ గా పరిచయమై డెబ్యూ సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ‘ఫిదా’ సినిమాతో అడుగు పెట్టింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి నేచురల్ పర్ఫార్మర్ అని టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది. గ్లామర్ ట్రీట్ ఇవ్వకుండానే స్కిన్ షో చేయకుండా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. కథ నచ్చి అందు లో తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోవడం లేదు సాయి పల్లవి.
రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తామన్నా కూడా నిర్మొహమాటంగా నో అనేస్తుంది. అయినా కూడా సాయి పల్లవి వరసగా అవకాశాలు దక్కుతున్నాయి. డేట్స్ దొరకడం చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న సాయి పల్లవి.. ఈ ఏడాది లో టాలీవుడ్ హీరోలకి పోటీ అన్నట్టూగా వరసగా సినిమాలతో వస్తోంది. గతేడాది ఓ ఆంథాలజీతో ఓటీటీ ఆడియన్స్ ని పలకరించిన సాయి పల్లవి.. 2021లో మూడు సినిమాలతో రాబోతోంది. మూడు సినిమాల మీద ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ నెలకొంది.
Sai pallavi : సాయి పల్లవి హైలెట్ గా నిలిచింది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇటీవల రిలీజైన సారంగ దరియా సాంగ్ తో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతోంది. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటించిన విరాట పర్వం అన్న సినిమా చేసింది. ప్రియమణి మరొక హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ‘కోలు కోలు’ సాంగ్ అలాగే టీజర్ లో సాయి పల్లవి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఇక నాని తో ‘శ్యామ్ సింగ్ రాయ్’ సినిమాలో సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రాబోతోంది. ఇవి కాకా మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయట.