Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ మేకర్స్తో భారీ బడ్జెట్ సినిమాను చేయబోతున్నాడనే లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ‘జనతా గ్యారేజ్’. ఈ మూవీలో మలయాళ మెగా స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే స్టార్ హీరోయిన్స్ సమంత అక్కినేని, నిత్యా మీనన్ తారక్ సరసన నటించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కాగా ఇప్పుడు ఇదే సినిమాను మైత్రీ మూవీస్ సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ – సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మించబోతున్నారట. ఈ సినిమా హిందీ రీమేక్ తో కొరటాల బాలీవుడ్ లో అడుగు పెడతాడని టాక్ వినిపిస్తోంది. లేదంటే ప్రభుదేవా డైరెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట.
Salman khan : 2023 లో ‘జనతా గ్యారేజ్’ హిందీ రీమేక్ పట్టాలెక్కనుందని అంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలతోనూ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ తో ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే మేకర్స్ సల్మాన్ కి 10
కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు కుదిరితే 2023 లో ‘జనతా గ్యారేజ్’ హిందీ రీమేక్ పట్టాలెక్కనుందని అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్ వరుసగా హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అవి పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారట.