Samantha: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండట్లేదు. కేవలం వాణిజ్య ప్రకటనలు, తన సినిమా ప్రమోషన్స్ను మాత్రమే తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తోంది ఈ భామ. ఈ అగ్రతార గురించి ఇటీవల కాలంలో ఎలాంటి అప్డేట్స్ కూడా రాలేదు. ఆమెకు ఏదో స్కిన్ ప్రాబ్లమ్ అని, ఇంకా ఏదో అయిందని పుకార్లు షికారు చేశాయి. వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది.
Samantha: డౌన్ బట్ నాట్ అవుట్
సామ్ తన డాగ్ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ” డౌన్ నాట్ అవుట్” (వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు) అని అర్ధం వచ్చేట్లు పోస్ట్ చేసింది సమంత. ఈ పోస్ట్ కాస్తా వైరల్ అయింది. సమంత ఎమోషనల్గానే ఈ పోస్ట్ చేసింది అని కొందరు కామెంట్ చేస్తుండగా.. కొందరు సెలబ్రిటీలు మోర్ పవర్ టూ యు బీ స్ట్రాంగ్ అంటూ సమంతకు ధైర్యం చెబుతున్నారు.
ఆ తరువాత ఇదే మొదటిసారి
జూన్ 16 తరువాత సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇదే మొదటి సారి. ఆమె ఇటీవల యూఎస్ఎకి వెళ్ళింది. అయితే, USA పర్యటన అనేక ఊహాగానాలకు దారితీసింది. స్కిన్ ట్రీట్మెంట్ కోసమే ఆమె అమెరికా వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. కానీ వీటన్నిటి పై సమంత స్పందించలేదు. చైతూతో విడాకుల అనంతరం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఇక కెరీర్ పరంగా చూసుకుంటే సామ్ నటిస్తున్న యశోద, శాకుంతలం సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఈ నెలలో సమంత ‘ఖుషి’ షూటింగ్ను తిరిగి ప్రారంభించనుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో ఆమె తన అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ షూటింగ్ను కూడా ప్రారంభించనుంది.