తెలుగుదేశం – జనసేన తొలి జాబితా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా మొత్తం 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో టీడీపీ నుంచి 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా… జనసేన నుంచి 5 సీట్లకు పవన్ అభ్యర్థులను ప్రకటించారు. ఇక కులాల వారీగా ఏ కులలానికి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చిందో ఓ సారి లిస్టు చూద్దాం.
ముందుగా టీడీపీ తొలి జాబితాలో మొత్తం 94 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ లిస్టులో కులాల వారీగా చూస్తే
కమ్మ-21
ఎస్సీ- 20
బీసీ-18
రెడ్డి- 17
కాపు- 7
ఎస్టీ-3
క్షత్రియ-4
వెలమ-1
వైశ్య-2
మైనార్టీ- 1
బీసీలలో
గవర-1,
శెట్టిబలిజ-1
యాదవ్-3
పొలినాటి వెలమ -1
కొప్పుల వెలమ-2
తూర్పు కాపు- 2
గౌడ్-3
కాళింగ-2
మత్స్యకార-1
కురుబ-1
బోయ-1
చొప్పున సీట్లు కేటాయింపు జరిగింది. ఇక టీడీపీ 2019లో బిసీలకి 43 సీట్లు ఇచ్చింది. మిగిలిన 57 సీట్లలో ఆ పార్టీ 25 ఇవ్వగలిగితేనే గత ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన లెక్క ఇప్పుడు సరి చేసినట్టు అవుతుంది. ఏదేమైనా టీడీపీ తొలిజాబితాలోనే ఎప్పుడూ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వం ఆనవాయితీగా ఉంటోంది. అయితే ఈ సారి బీసీలకు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక కమ్మ సామాజిక వర్గానికి అత్యధికంగా 21 సీట్లు కేటాయించారు. రెడ్డి వర్గానికి కూడా 17 సీట్లు చంద్రబాబు ఇచ్చారు.
ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీ మొత్తం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుదని పవన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ముందుగా ఐదు అసెంబ్లీ సీట్లలో పవన్ తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థల పేర్లను ప్రకటించారు. ఇందులో కులాల వారీగా చూస్తే
కమ్మ-1
కాపు-2
గవర-1
బ్రాహ్మణ-1
చొప్పున సీట్లు కేటాయింపు జరిగింది. విచిత్రం ఏంటంటే టీడీపీ జాబితాలో చంద్రబాబు కుప్పం నుంచి, ఆయన తనయుడు లోకేష్ మంగళగిరి నుంచి, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీలో ఉంటారని తొలి జాబితాలోనే వారి పేర్లు ప్రకటించారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు మాత్రం తొలి జాబితాలో లేకపోవడం విచిత్రం అని చెప్పాలి.