Balakrishna : నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి మళ్ళీ పాత్త కథే పునరావృతం అవుతోందని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గత కొంత కాలంగా ఆయన పక్కన నటించే హీరోయిన్స్ కరెక్ట్ గా సెట్ అవడం లేదు. ఎవరినీ తీసుకోవాలన్నా ఏదో ఒక సమస్య వస్తోంది. క్రేజ్ ఉన్న హీరోయిన్స్ బాలయ్య సినిమా అంటే నో అంటున్నారు. కొత్త వాళ్ళని తీసుకుందామా అంటే ఆయన ఏజ్కి డెబ్యూ హీరోయిన్ పనికిరారు. పక్క రాష్ట్రం హీరోయిన్స్ని తీసుకు వద్దామంటే కుదరడం లేదు. అఖండ సినిమాకి ఎంతమంది పేర్లు ప్రచారంలో నిలిచాయో అందరికీ తెలిసిందే. అయినా చివరికి బోయపాటితో ఆల్రెడీ సినిమా చేసిన కంచె బ్యూటీని తీసుకున్నారు.
కీర్తి సురేష్ ను ముందు అఖండకి అడిగితే నో అనిందని టాక్ వచ్చింది. మరోసారి బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ని తీసుకోవాలనుకుంటే చూసి చూసి బోర్ కొట్టేసింది అని వద్దనుకున్నారు. నయనతార అంటే ఇప్పటికే బాలయ్యతో చేసేసింది. మళ్ళీ అన్నా కూడా ఆమె డేట్స్ దొరకలేదు. మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టీన్ని ఓకే అనుకొని ఆమెతో ఏదో సమస్య వచ్చి వద్దన్నారు. సాయేషా సైగల్ ఓకే చేసి మరీ వద్దని చెప్పారు. ఇలా అఖండ సినిమాకే ఇంతమందిని అనుకొని చివరికి హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్, కీలక పాత్రకి పూర్ణలను ఫైనల్ చేశారు.
Balakrishna : బాలయ్య సినిమా అంటే హీరోయిన్ విషయంలో చాలా కసరత్తులే చేయాల్సి వచ్చేలా ఉంది.
ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోయే సినిమా విషయంలో హీరోయిన్స్ విషయంలో కూడా ఇబ్బందులు వస్తున్నాయట. గోపీచంద్ మలినేని – శృతి హాసన్లది హిట్ కాంబినేషన్. ఇటీవల వచ్చిన క్రాక్ సినిమా కూడా భారీ హిట్ సాధించింది. ఆ కారణంగా గోపీచంద్ మలినేని బాలయ్యతో చేయబోయో సినిమాకి హీరోయిన్గా చేయమని అడిగాడట. కానీ ఈ బ్యూటీ సలార్ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇచ్చేసినట్టు చెప్పి సింపుల్గా నో అన్నదని టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ మళ్ళీ బాలయ్య సినిమా అంటే హీరోయిన్ విషయంలో చాలా కసరత్తులే చేయాల్సి వచ్చేలా ఉంది.