రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న పాలనా పరమైన నిర్ణయాలను తరచూ న్యాయస్థానాలు కొట్టివేయడం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీర్పులివ్వడం పై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి.ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అరవై అయిదు తీర్పులు వెలువడటం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.తెలంగాణలోనూ ఇందుకు భిన్నమైన పరిస్థితి లేదు.
ఎందుకని ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తలెత్తుతోంది అన్నది అన్నది జాతీయ మీడియా లేవనెత్తుతున్న ప్రశ్న.!అదే సమయంలో బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదని కూడా జాతీయ మీడియా చెప్పడం ఆసక్తికరంగా ఉంది.అయినా రాష్ట్రప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు నిబద్ధత ఉండదా? ప్రజాప్రయోజనం వాటిలో కనిపించదా? కేవలం స్వలాభం కోసమే నిర్ణయాలు ఉంటాయా? అని న్యాయ కోవిదులే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ.. న్యాయసమీక్షలో నిలబడడం లేదు.
దాదాపు ఇప్పటికి 64 కేసుల్లో ఒక్కటి ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదు. కార్యాలయాలకు రంగుల విషయం పక్కన పెడితే.. పేదలకు ఇంగ్లీషు చదువులు అందాలన్న బృహత్ సంకల్పాన్ని కూడా కోర్టులు కొట్టేశాయి.అంతేకాదు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయం కూడా తమ కనుసన్నల్లోనే సాగాలని హుకుం జారీ చేశాయి. చివరకు ప్రభుత్వం అప్పులు తేవాలన్నా.. భూములు విక్రయించాలన్నా.. ఇలా ఏ నిర్ణయంపైనైనా.. అన్నీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వ్యతిరేకత వస్తోంది. పోనీ.. ఈ పరిస్థితి ఒక్క ఏపీకే ఉందా? అంటే అలా లేదు. పొరుగునే ఉన్న తెలంగాణలోనూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టు కొట్టేస్తోంది. శవాలకు కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని హైకో ర్టు ఆదేశించింది.ఈ వివాదాలు ఎక్కడ వరకూ వెళ్తాయో అర్థంగాని పరిస్థితి నెలకొంది
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పాలించడం రాదని అనుకునేలా తీర్పులు ఉండటం ముఖ్యమంత్రులకు ఇబ్బందికరమే.