చిత్రసీమ కరోనా భయాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని షూటింగులు మొదలు పెట్టడానికి కదులుతుంది. ఇంతలో టాలీవుడ్ ఉలిక్కి పడే వార్త వైరల్ గా మారింది. పుష్ప సినిమా సెట్లో కరోనా ఎంటరైందిదట. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయిందన్న వార్త టాలీవుడ్ ని కంగారు పెట్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప షూటింగ్ ఇటీవలే మొదలైందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. కాగా బన్నీతో సహా ప్రధాన తారాగణం అంతా షూటింగ్ లో పాల్గొంటోంది.
ఇక కరోనా కఠిన నిబంధనలు పాటిస్తూ సెట్లో 150 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదనే రూల్ పాటించాలని చెబుతున్నా, ఈ చిత్ర బృందం అంతకు మూడు రెట్ల సిబ్బందితో షూటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నందునే యూనిట్ లో జీనియర్ ఆర్టిస్టుల సహా దాదాపు 300 మంది షూటింగ్ లో పాల్గొనాల్సిన అవసరం ఉందట. కాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న వాళ్లలో ఓ 10 మందికికి కరోనా వచ్చినట్టు తెలిసిన వెంటనే చిత్ర యూనిట్ షూటింగ్ ని నిలిపేసినట్టు సమాచారం.
దీంతో ప్రస్తుతం సెట్లో ఉన్న సినిమాలు, అందులో పాల్గొంటున్న నటీనటులు, సాంకేతిక నిపుణులలో ఇప్పుడు కంగారు మొదలయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక సాహసించి సెట్లో అడుగుపెట్టినవాళ్లు సైతం పుష్ప కారణంగాతో కాస్త వెనకడుగు వేస్తారేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ మొదలు పెడితే సడెన్ గా ఇలా అవ్వడంతో ఈ చిత్ర దర్శకుడు అయిన సుకుమార్ తీవ్రంగా నిరాశలో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సుక్కూ స్వీయ నిర్భంధంలోకి వెళ్లారని తెలుస్తోంది.
ఇక ఈ చిత్ర నిర్మాతలు కూడా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే కరోనా టెస్టులు చేయించుకున్నారని సమాచారం. కాగా హీరో అల్లు అర్జున్ పరిస్దితి ఏంటో ఇంకా బయటకు రాలేదు. అయితే వీరికి కోవిడ్ సోకిందా లేదా అని తెలుసుకోవడానికి వారం పాటు వేచి ఉండాల్సి ఉంటుందట. మొత్తానికి పుష్ప టీమ్ పేల్చిన సడెన్ బాంబ్ టాలీవుడ్ చిత్రసీమను షేక్ చేసిందని అనుకుంటున్నారట.