CM YS Jagan: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పై ఇవేళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై కారణాలు తెలపాలని సీబీఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
రఘురామ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసన విచారణ జరిపింది. రెండు పిటిషన్లపై రిప్లై కి సీఎం జగన్ మరింత సమయం కోరారు. తదిపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది.
జగన్ ఆక్రమాస్తుల కేసులో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యం అవుతోందని సీబీఐ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ రాజు ధర్మాసనానికి తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రాజకీయ నేత, సీఎం అన్న కారణంగా ట్రయల్ జాప్యం కావద్దని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ట్రయల్ వేగంగా జరపాలని ఆదేశించారు. బెయిల్ రద్దు, హైదరాబాద్ నుండి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్ల ను కలిపే విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుండి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.
Janasena: జనసేనలోకి మండలి బుద్దప్రసాద్ ..? ఆవనిగడ్డ అభ్యర్ధిత్వంపై హామీ..!