బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఎన్నో మలుపులను తిప్పుతోంది. ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ముందుగా అందరూ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే అనుకున్నారు. తర్వాత అది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ పెద్ద బాంబు పేల్చారు. సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు సుశాంత్ అంటూ కొందరు ఆరోపించారు.
అలా సుశాంత్ మరణం ఎన్నో మలుపులను తిరిగింది. అంతేనా.. బాలీవుడ్ లో సుశాంత్ మరణంతో నెపోటిజం వెలుగులోకి వచ్చింది. అందరూ నెపోటిజంపై పడ్డారు. కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు బాలీవుడ్ లో నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఇవన్నీ కాసేపు పక్కన బెడదాం. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మరో ట్విస్ట్ వచ్చింది. అదే సుశాంత్ దగ్గర ఇదివరకు పని చేసిన అంకిత్ ఆచార్య రూపంలో. అవును.. అంకిత్ ఆచార్య గత కొన్ని రోజుల నుంచి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.
తాజాగా మరో సంచలనానికి తెర లేపాడు అంకిత్. ఇంతకుముందు అంకిత్.. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సుశాంత్ ది కన్ఫమ్ గా హత్యే అంటూ చెప్పుకొచ్చాడు.
సుశాంత్ ను ఎలా చంపి ఉంటారో కూడా అంకిత్ చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సుశాంత్ ను తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఫడ్జ్ బెల్ట్ తో చంపారంటూ అంకిత్ ఆరోపిస్తున్నాడు. ఆ బెల్ట్ తో సుశాంత్ గొంతును గట్టిగా బిగించి కొట్టి చంపేశారు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు అంకిత్.
అయితే.. సుశాంత్ శరీరంపై చనిపోయిన సమయంలో కొన్ని గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు చంపే సమయంలో కొట్టడం వల్ల తగిలినవే అంటూ అంకిత్ ఆచార్య ఆరోపించాడు. ఇదంతా చేసింది రియా చక్రవర్తేనని.. పథకం ప్రకారం రియా ఇదంతా చేసిందని అంకిత్ చెబుతున్నాడు.
ఇదివరకు సుశాంత్ దగ్గర పనిచేసిన చాలామందిని రియా తొలగించిందని… ఎటువంటి కారణం చెప్పకుండా వాళ్లను తొలగించి.. తనకు తెలిసినవాళ్లను సుశాంత్ దగ్గర పనిలో పెట్టించిందని.. ఇదంతా సుశాంత్ ను చంపడానికేనని అంకిత్ ఆరోపించాడు.
సుశాంత్ దగ్గర తను పనికి పెట్టించిన వాళ్లతోనే సుశాంత్ ను రియా చక్రవర్తి చంపించిందని.. ఇదంతా క్షణాల్లో జరిగిందేమీ కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని అంకిత్ ఆచార్య వెల్లడించాడు.
మరోవైపు రియా చక్రవర్తి మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంకిత్ చేసిన ఆరోపణలు ఇంకాస్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.