సుశాంత్ మరణం పట్ల ..ఆ ఘటన్ జరిగినప్పటి నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ముందునుంచి రక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉంది. అంతేకాదు ఈ కేసులో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కొంతమందికి సంబంధం ఉందంటూ కంగనా గట్టిగా వాదిస్తుంది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం అనేది పెద్ద మాఫియా లాంటిది. దీని కారణంగానే సుశాంత్ చనిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ చనిపోయినప్పటి నుండి కంగన సోషల్ మీడియాలో చేస్తున్న సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే కంగన రీసెంట్ గా రియా చక్రవర్తిపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
నేను ఇప్పటి వరకు ఎదుర్కొన్న కేసుల కోసం లాయర్ లను సమకూర్చుకోవడం పెద్ద కష్టం అని అర్థమైంది. ఎంత ఖర్చుతో కూడుకున్న విషయమో కూడా నాకు తెలుసు. అలాంటిది అంత తక్కువ సమయంలో సుశాంత్ కేసులో రియాకు సతీష్ వంటి పెద్ద లాయర్ ని ఎలా కాంటాక్ట్ అయింది. ఈ మద్యే కదా నా దగ్గర డబ్బులు లేవని చెపింది.. అంటూ కంగా సూటిగా ప్రశ్నించింది. సతీష్ లాంటి పెద్ద లాయర్ కు రియా ఎంత ఫీజు చెల్లిస్తుందో అంటూ కంగనా ప్రశ్నించింది.
అంతేకాదు ఈ కేసులో రియా వెనుక పెద్ద వారు ఉన్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ కంగనా వెల్లడించింది. ఈ విషయంలో రియా చక్రవర్తి పై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని అంటోంది. కాగా ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు రియా నుండి సీబీఐ సమాధానాలు రాబడుతుందని అంటున్నారు. ఈ విషయంలో సీబీఐ కంగనాను కూడా విచారించ వచ్చని సమాచారం.