అమరావతి: తెలుగుదేశం కార్యకర్తల రక్షణ కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం టిడిపి శాసనసభాపక్ష సమావేశం జరిగింది.
రేపటి నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ నాలుగు, ఐదు విడతలు చెల్లించడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. పది శాతం వడ్డీతో సహా రైతులకు ఇచ్చిన బాండ్లను గౌరవించాలని చంద్రబాబు పేర్కొన్నారు.
గత 15రోజులలో అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటం దారుణమని చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యకర్తకూ అండగా పార్టీ ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ తరపున ఏమి చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. రక్షణ కోరే కార్యకర్తల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.