పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూశారు. కరోనా బారినపడి అస్వస్థతకు గురైన వై టి రాజా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. రాజా మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ది వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వైటీ రాజా 1999 లో తణుకు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2004, 2009 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున క్రియా శీలకంగా పని చేశారు. రాజా మృతి తో వార్త కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు నేతలు కడసారి చూపు కోసం తణుకు నియోజకవర్గం నుండి హైదరాబాదు బయలుదేరి వెళ్లారు.
కరోనా నుండి చాలా మంది కోలుకుంటున్నప్పటికి అనంతరం వచ్చే అనారోగ్య సమస్యలతో కొందరు మృత్యువాత పడుతున్నారు. ప్రముఖ సినీ గాయకుడు బాలసుబ్రమణ్యం, తెలంగాణ మాజీ హోమ్ శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు కూడా కరోనా నుండి కోలుకున్నా అనంతరం వచ్చిన అనారోగ్య సమస్యలతోనే కన్ను మూశారు.