అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి ఎంపి సుజనా చౌదరికి సిబిఐ సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ బెంగళూరు బ్రాంచ్ సూచించింది.
బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ వ్యవహారంలో బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసు నమోదైంది. 2017లో ఆంధ్రా బ్యాంకును 71 కోట్ల రూపాయల మేర మోసం చేసిన కేసులో ఆయనపై గురువారం సమన్లు జారీ అయ్యాయి.
మరోవైపు సిబిఐ సమన్లపై సుజనా చౌదరి స్పందించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీతో తనకు సంబంధం లేదని సుజనా చౌదరి అన్నారు. 2014 నుంచి ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా లేననీ, 2003 నుంచి 2014 వరకూ మూడు కంపెనీల్లో మాత్రం నాన్ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్ననీ సుజనా చౌదరి తెలిపారు.