వామ్మో.. ఇవ్వేం వర్షాలు దేవుడా. వారం పది రోజుల నుంచి వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. బయటికి వెళ్లేట్టు లేదు.. సరుకులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేకుండా వర్షం దంచికొడుతూనే ఉన్నది.
భారీ వర్షాలకు తెలంగాణలోని భద్రాచలం వల్ల గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నదికి వరద ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి చాలా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది.
ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరింది. 60 అడుగులకు చేరడమంటే మాటలు కాదు. ఇలా 60 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరకు గత ఏడేళ్లలో ఇది రెండోసారి. 2013లో కూడా భారీ వర్షాలకు గోదావరి 61 అడుగులకు చేరింది. మళ్లీ ఇప్పుడు 60 అడుగులకు చేరడంతో వెంటనే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అయితే.. గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ పోతుండటంతో చుట్టు పక్కన ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ గోదావరి నీటిమట్టం 63 అడుగులు దాటితో చుట్టు పక్కన ఉన్న ముంపు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నదని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
అయితే… భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఇప్పటికి రెండు సార్లు మాత్రమే 70 అడుగులు దాటిందట. 1986లో గోదావరి నీటిమట్టం ఏకంగా 75.66 అడుగులకు చేరిందట. ఆ తర్వాత 1990లో మరోసారి 70.8 అడుగులకు చేరిందట.