పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుండి గ్రాండ్గా సినీ రంగప్రవేశం చేసి వరుసగా 25 సినిమాల వరకు నటించి తర్వాత రాజకీయ బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ తమ్ముడిగా చిత్ర సీమకు పరిచయం అయ్యి నటించింది కొన్ని సినిమాలే అయినా అన్నయ్య చిరంజీవి రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడగట్టుకున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా అసాధారణమైన క్రేజ్ ని పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇంత క్రేజ్ ఉన్నా కూడా జనాలకి ఏదో చేయాలన తపన. అందుకే రాజకీయాల వైపు అడుగులు వేశాడు.
రెండేళ్ల క్రితం జనసేనానిగా జనం సమస్యలను తీర్చేందుకు వెళ్ళి ప్రస్తుతం అభిమానుల కోసం కొందరు నిర్మాతలతో కమీతవం కారణంగా తిరిగి ముఖానికి రంగేసుకొని వకీల్ సాబ్ చిత్రంతో వెండి తెరమీదికి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ చిత్రం పింక్ సినిమాకు రిమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితుల వల్ల ఈ సినిమా విడుదలపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయట. వాస్తవంగా వకీల్ సాబ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి పవన్ అభిమాన ప్రేక్షకుల మనసుల్లో సంతోషాన్ని నింపుతుందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ చిత్ర నిర్మాత అయిన దిల్ రాజు మాత్రం భారీ బడ్జెట్ తో రూపొందిన వకీల్ సాబ్ సినిమా ను 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో విడుదల చేయడం అంటే రిస్క్ తీసుకోవడమే అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అయిన సమయంలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో దిల్ రాజు తో పాటు చిత్ర బృందం ఉన్నారట. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల జనాలు సినిమాకు అలవాటు పడి పెద్ద సినిమా విడుదల అనగానే ఎగబడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారట. అందుకే రాజు గారు వకీల్ సాబ్ ను ప్రేక్షకుల ముందుకు నెమ్మదిగానే తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.