తిరుపతి: తిరుపతి, తిరుమలకు ఉగ్రవాద హెచ్చరికలు లేవనీ, భక్తులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పి అన్బురాజన్ తెలిపారు.
తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎస్పి అన్బురాజన్ మీడియా సమావేశం సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తిరుపతిలో సాధారణ తనిఖీలు మాత్రమే చేపడుతున్నట్లు తెలిపారు.
తిరుపతి పటిష్టమైన భద్రత కల్గిన ఆథ్యాత్మిక క్షేత్రమని ఆయన అన్నారు. తిరుపతిలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్ని సిసి కెమెరాలు సక్రమంగానే పని చేస్తున్నాయనీ, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కొన్ని కెమెరాలు పని చేయడం లేదన్న సమాచారం ఉందనీ, వాటి స్థానంతో కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు లేఖ రాశామనీ ఎస్పి వెల్లడించారు.
previous post
next post