కాశ్మీర్: జమ్ముకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ ఎత్తున భద్రతాబలగాలు మోహరించినప్పటికీ…ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో నూర్ మొహమ్మద్ దార్ (42) అనే ట్రక్కు డ్రైవర్పై కొందరు యువకులు రాళ్లు రువ్వారు. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సైనిక వాహనం అని పొరపడి అల్లరి మూకలు మొహమ్మద్ దార్ ట్రక్కుపై దాడి చేశారని చెప్పారు. ఒక రాయి అతని తలపై బలంగా తాకడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికి ఫలితం లేకపోయిందని వివరించారు. అరెస్ట్ అయిన ఇద్దరు యువకులపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరో ఆరుగురిని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
previous post
next post